Friday, May 10, 2024
- Advertisement -

‘యాత్ర’ ద‌ర్శ‌కుడికి టికెట్ ఆఫ‌ర్ చేసిన వైఎస్ జగ‌న్‌

- Advertisement -

ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి ,దివంగ‌త నేత డాక్డ‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌రరెడ్డి మ‌ర‌ణించి దాదాపు 10 సంవ‌త్స‌రాలు కావ‌స్తోన్న ఇప్ప‌టికి తెలుగు రాష్ట్రాల‌లో ఆయ‌నే హాట్ టాపిక్‌. ఇటీవ‌లే ఆయ‌న పాద‌యాత్ర ఆధారంగా ‘యాత్ర’ అనే సినిమాను తెర‌కెక్కించారు. ఈ సినిమాలో వైఎస్‌గా మళ‌యాళ సూప‌ర్‌స్టార్ న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు మహి వి రాఘవ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బాక్సా ఫీస్ వ‌ద్ద ఈ సినిమా సూప‌ర్ హిట్ అయింది. తెలుగు ప్రజ‌లు మ‌ళ్లీ వైఎస్ఆర్‌ను గుర్తుకు తెచ్చుకున్నారు. ఈ సినిమా బాగుంద‌ని వైసీపీ అధినేత చిత్ర యూనిట్‌ను ఇంటికి పిలిపించుకుని మ‌రి అభినందించారు. ఇక్క‌డ వ‌ర‌కు బాగానే ఉంది కాని, ఈ సినిమా ద‌ర్శకుడు మహి వి రాఘవ్‌కు వైసీపీ టికెట్ ఇస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

సినిమాను ప్ర‌జ‌ల‌లోకి తీసుకువెళ్లి వైఎస్ఆర్‌ను మ‌ళ్లీ గుర్తుకు తెచ్చినందుకు గాను మహి వి రాఘవ్‌కు టికెట్ ఇచ్చే ఆలోచ‌న చేస్తున్నాడ‌ట జ‌గ‌న్‌. అయితే ఈ వార్త‌ల‌పై స్పందించాడు యాత్ర ద‌ర్శ‌కుడు. జగన్ తనకు ఎమ్మెల్యే సీటు ఇస్తారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని తనకు అసలు భారతదేశ పౌరసత్వమే లేదని ఆసక్తికర కామెంట్స్ చేశారు.నాకు రాజకీయాలు అవసరం లేదు. జగన్ సీటు ఇస్తానన్నారని ఏవేవో ప్రచారం చేస్తున్నారు. అదంతా అబద్ధం. ఇలాంటి పుకార్ల‌ను న‌మ్మ‌కండి అని ఆయ‌న తెలిపారు.ప్రస్తుతానికి సినిమాలేవీ తీయడం లేదని, కాస్త సమయం తీసుకొని నెక్స్ట్ సినిమా తీస్తానని, ఒక సినిమా తీయడానికి తనకు సుమారు రెండేళ్ల సమయం పడుతుందని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -