Thursday, April 25, 2024
- Advertisement -

బాక్సాఫీసు వద్ద మూడో రోజు కూడా కలెక్షన్లు కొల్లగోడుతున్న సాహో…రూ.300 కోట్ల దిశగా పరుగులు

- Advertisement -

బాహుబాలి తర్వాత అంతే రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘సాహో’ సినిమా మొన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.తెలుగు ప్రేక్షకులు నెగటివ్ గా ఉన్నా ఉత్తరాదిన మాత్రం ఈ సినిమాకి విపరీతమైన క్రేజ్ నెలకొంది. అయితే టాక్ సంగతి ఎలా ఉన్నా కలెక్షన్లు మాత్రం ఎక్కడా తగ్గడంలేదు.

హిట్ కాకపోయినా సాహో’ చిత్రం మిక్స్ డ్ టాక్ తో సైతం కలెక్షన్లు కొల్లగొడుతోంది. ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబడుతోందివాస్తవానికి ‘సాహో’ ప్రభంజనం మొదటిరోజుకే పరిమితం అనుకున్నారు అంతా. కానీ, రెండో రోజు కూడా బాక్సాఫీసుని వసూళ్ల వరదతో ముంచెత్తింది ‘సాహో’. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.130 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ‘సాహో’.. రెండు రోజుల్లో రూ.205 కోట్లు రాబట్టింది. ఇక తొలివారం ముగిసేసరికి మూడు రోజుల్లో రూ.294 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి రూ.300 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది

ఫెస్టివల్ సీజన్ కావడంతో మూడో రోజు సైతం కలెక్షన్లలో ఏమాత్రం తగ్గుదల కనిపించలేదు. అన్ని సెంటర్లలో కలిపి రూ.94 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో విడుదలైన ఈ చిత్రం రికార్డుల పరంగా మున్ముందుకు దూసుకు వెళ్తోంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే సాహో సినిమా నాన్-బాహుబలి రికార్డుతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు మహేష్, బన్నీ, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి హీరోలు నాన్-బాహుబలి రికార్డులు సృష్టించగా వాటినిన్నటినీ తుడిచిపెట్టేసింది సాహో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -