Friday, May 3, 2024
- Advertisement -

సాహో సినిమా లో మరొక బాలీవుడ్ బ్యూటీ

- Advertisement -

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సాహో’ సినిమా భారీ అంచనాల మధ్య ఆగస్ట్ 30 న విడుదల కాబోతోంది. ప్రస్తుతం చిత్ర దర్శకనిర్మాతలు సినిమా ప్రమోషన్ లపై దృష్టి పెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలను విడుదల చేశారు. అందులో ఒకటి ‘సైకో సైయాన్’ అనే పార్టీ పాట మరియు రెండవది ‘ఏ చోట నువ్వున్నా’ అని సాగే ప్రభాస్ శ్రద్ధ కపూర్ ల మధ్య రొమాంటిక్ పాట. తాజాగా సినిమా నుంచి మూడవ పాటను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు దర్శక నిర్మాతలు.

పాప్యులర్ ర్యాపర్ బాద్షా ఈ పాటకి సంగీతాన్ని అందించారు. బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఈ పాటలో స్పెషల్ అప్పీరన్స్ ఇవ్వబోతోంది అని సమాచారం. బాద్షా మరియు జాక్వెలిన్ కలిసి ప్రభాస్ తో డాన్స్ చేయబోతున్నారట. ఈ పాట వీడియో కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యువి క్రియేషన్స్ మరియు టి సిరీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా లో నీల్ నితిన్ ముకేష్, జాకీ శ్రోఫ్, మందిరా బేడీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -