బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘సాహో’ ట్రైలర్ వచ్చేసింది. ఇదివరకెన్నడూ చూడని యాక్షన్ సీన్స్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అత్యంత భారీ ఎత్తున నిర్మించారు. ఇప్పటికే టీజర్స్, సాంగ్స్తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న సాహో.. యూట్యూబ్ను షేక్చేసేందుకు సిద్దమైంది . ట్రైలర్ భారీ యాక్షన్ ఎలిమెంట్స్తో శనివారం నాడు విడుదలైంది.
రెండు వేల కోట్ల రాబరీ.. దాన్ని చేజ్ చేసేందుకు పోలీసులు.. చేజిక్కించుకునేందుకు అండర్ వరల్డ్ డాన్స్.. ఇది వరకు చూడని పోరాట సన్నివేశాలను మన ముందుకు తీసుకొస్తుంది సాహో.హాలీవుడ్ యాక్షన్ చిత్రాలను తలపించే హై టెక్నికల్ వాల్యూస్తో హై వోల్టేజ్ క్రియేట్ చేసేలా ఈ ట్రైలర్ను రూపొందించారు దర్శకుడు సుజీత్.
రెండు వేల కోట్ల రాబరీ.. దాన్ని చేజ్ చేసేందుకు పోలీసులు.. చేజిక్కించుకునేందుకు అండర్ వరల్డ్ డాన్స్.. ఇది వరకు చూడని పోరాట సన్నివేశాలను మన ముందుకు తీసుకొస్తుంది సాహో.ఈ రెండు నిమిషాల 46 సెకన్లలోనే ఈ రేంజ్లో చూపించాము.. ఇక సినిమా మొత్తం ఎలా ఉంటుందో ఊహించుకోండి అనేట్టుగా ట్రైలర్ను కట్చేశారు.
ఈ చిత్రంలో శ్రద్దా కపూర్ హీరోయిన్గా నటించగా.. జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, మందిరా బేడీ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.