- Advertisement -
మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ఇంటిలిజెంట్. ఈ సినిమా ఫస్ట్లుక్ను ఇంటిలిజెంట్గానే విడుదల చేశారు. సాయిధరమ్ ట్విట్టర్ ద్వారా ఈ పోస్టర్ను పంచుకున్నాడు. ఈ పోస్టర్లోసాయిధరమ్తేజ్ చాలా సీరియస్గా కనిపిస్తున్నాడు.
సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సి.కల్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు ఈ సినిమా బృందం చేస్తోంది. సాయి ధరమ్ తేజ్ పక్కన హీరోయిన్గా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. ఫిబ్రవరి 9వ తేదీన ఈ సినిమా విడుదల చేయనున్నారు.