మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచియం అయ్యాడు సాయి ధరమ్ తేజ్.కెరీర్ మొదట్లో వరుస హిట్లు కొట్టిన తేజు తరువాత కాలంలో రేస్లో వెనుక పడ్డాడు.వచ్చిన సినిమాలన్ని ఫెయిల్ కావడంతో తీవ్ర నిరాశలో ఉన్నాడు.ఎన్నో ఆశలు పెట్టుకుని వివి.వినాయక్ దర్శకత్వంలో ఇంటిలిజెంట్ మూవీని చేశాడు సాయి ధరమ్ తేజ్.కాని ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిల్ అయింది.దీంతో స్టోరీ సెలెక్షన్లలో జాగ్రతగా ఉంటున్నాడు.దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఓ కథతో సాయి ధరమ్ తేజ్ దగ్గరకి వస్తే ఈ కథ తనుకు సూట్ అవదని చెప్పి రిజెక్ట్ చేశాడని తెలుస్తుంది.
చంద్రశేఖర్ యేలేటి పేరు వినగానే ‘ఐతే’ .. ‘అనుకోకుండా ఒకరోజు’ .. ‘మనమంతా’ వంటి సినిమాలు గుర్తుకువస్తాయి. విభిన్నమైన కథలను ఎంచుకుని వాటిని తనదైన శైలిలో ఆయన ఆవిష్కరిస్తూ ఉంటాడు. చంద్రశేఖర్ యేలేటి సినిమాలో హీరోయిజం ఉండదు,సినిమా అంతా కథకు అనుగుణంగా ఉంటుంది తప్ప అనవసరమైన ఫైట్లు,సాంగ్స్ ఉండవు.దీంతో ఈ సినిమా నుండి సాయి తప్పుకున్నాడని తెలుస్తుంది.ఫైనల్గా ఈ సినిమాకు హీరో నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.