Monday, May 6, 2024
- Advertisement -

ప‌వ‌న్‌పై కామెంట్స్ చేసిన సాయికుమార్‌

- Advertisement -

న‌టుడు సాయికుమార్ క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌లో బ‌రిలోకి దిగుతున్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే.బిజేపి పార్టీ త‌రుపున ఆయ‌న బాగేపల్లి నియోజిక‌వ‌ర్గంలో త‌న అదృష్ట‌న్ని ప‌రీక్షించుకుంటున్నారు.2013లో జ‌రిగిన ఎన్నిక‌ల‌లో కూడా ఆయ‌న బిజేపి అభ్య‌ర్థిగా పోటి చేశారు. కాని ఆ ఎలెక్ష‌న్స్‌లో ఆయ‌న ఓడిపోయారు.ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న బిజేపి త‌రుపున ఎన్నిక‌ల బ‌రిలో దిగుతున్నారు. అక్క‌డ తెలుగు ప్ర‌జ‌లు ఎక్కువుగా ఉండటంతో వారిని ఆక్క‌ట్టుకొనే ప‌నిలో ప‌డ్డారు.ప‌లు ఎన్నిక‌లు హామిలు ఇస్తు ఎన్నిక‌లలో దూసుకుపోతున్నారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతు సాక్షాత్తు ప‌వ‌ర్ స్టార్ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌చ్చి ప్ర‌చారం చేసిన గెలుపు నాదే అని ధీమా వ్య‌క్తం చేశారు.ప‌వ‌న్ వ‌చ్చి ఇక్క‌డ ప్రచారం చేస్తే …త‌న‌కు కౌంట‌ర్లు ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉన్నాన‌ని సాయి కుమార్ తెలిపాడు. తెలుగువారు అధికంగా ఉండే బాగేపల్లి నియోజకవర్గంలో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని అన్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -