Monday, May 13, 2024
- Advertisement -

భానుమతి కోసం ధనుష్ ఏం చేశాడంటే..?

- Advertisement -

సాయి పల్లవి.. ఇప్పుడు ఈ పేరు ఓ బ్రాండ్. ఏ హీరోయిన్ కి రాని క్రేజ్ ఈ భామకి ఒక్క సినిమాతో వచ్చేసింది. మలయాళంలో ప్రేమమ్ తో ఆకట్టుకున్న ఈ భామ తెలుగులో ఫిదా మూవీతో ఫిదా చేసింది. ప్రేమ‌మ్ గానీ.. క‌లి గానీ.. ఇప్పుడు ఫిదా గానీ అన్నింట్లోనూ హీరోల‌ను డామినేట్ చేసింది ఈ ముద్దుగుమ్మ‌.

ఈమెకు తెలుగులో ఉన్న క్రేజ్ వాడుకోవడానికి ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. ఈమె మ‌ళ‌యాలంలో న‌టించిన క‌లి సినిమాను తెలుగులో హేయ్ పిల్ల‌గాడ అంటూ తీసుకొస్తున్నారు. దుల్క‌ర్ స‌ల్మాన్ ఇందులో హీరోగా న‌టించాడు. ఈ చిత్రంతో పాటు తెలుగులో నానికి జోడీగా న‌టిస్తోన్న ఎంసిఏ డిసెంబ‌ర్ 22న విడుద‌ల కానుంది. ఈ చిత్రాన్ని మ‌ళ‌యాలంలో విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. దీంతో పాటు.. తమిళంలో ఏఎల్ విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన క‌రు చిత్రం క‌ణం పేరుతో తెలుగులోనూ విడుద‌ల కానుంది. ఇలాంటి క్రేజ్ సంపాధించుకున్న సాయి పల్లవి చూసి.. స్టార్ హీరోలు కూడా తమ సినిమాలో హీరోయిన్ గా తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

సాయి పల్లవి క్రేజ్ కి ఫిదా యిన ధనుష్.. అమె తన నెక్ట్స్ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నాడు. ధనుష్ అప్పట్లో మారి సినిమాతో హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఆ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ చేయబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ధనుష్ సాయి పల్లవిని ఎంపిక చేశాడు. మారి 2 బై లింగువ‌ల్ గా రానుంది. మొత్తానికి సాయి పల్లవి తన క్రేజ్ సౌత్ ఇండియా మొత్తం చూపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -