Wednesday, May 15, 2024
- Advertisement -

పవన్ క్రేజ్ కి షాక్ అయిన సాయి పల్లవి

- Advertisement -

ప్రస్తుతం ఎక్కడ చూసిన సాయి పల్లవి గురించే మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు.. మీడియాలో కూడా ఈమె పేరు హోరెత్తిపోతోంది. ఫిదా సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సాయి పల్లవి.. టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా మారింది. చాలా మంది దర్శకనిర్మాతలు ఆమె డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆకక్తికర విషయాలను చెప్పింది.

ఫిదా మూవీ థియేటర్లో పవర్ స్టార్ కనిపించినప్పుడు వచ్చిన రెస్పాన్స్ చూసి షాక్ అయ్యాను అంటూ… ఒక దశలో తన డైలాగ్స్ కు క్లాప్స్ కొడుతున్నారా లేక పవన్ చూసి చప్పట్లు క్లాప్స్ కొడుతున్నారా అని కన్ఫ్యూజన్ అయ్యానని చెప్పింది. అంతేకాదు ఈ మూవీ ఆడియో వేడుకలో పవన్ పేరు చెపితే హాలంతా చప్పట్లతో మారుమ్రోగిపోయిన సందర్భాన్ని గుర్తుకు చేసుకుంటూ తనకు పవన్ తో కలిసి నటించాలి అని ఏర్పడిన కోరికను బయట పెట్టింది. ఇది ఇలా ఉంటే ‘ఫిదా’ సినిమాలో సాయి పల్లవి పోషించిన భానుమతి పాత్రకు మంచి స్పందన వస్తోంది.

ఇక ఆమె చెప్పిన డైలాగ్స్ కి థియేటర్లో క్లాప్స్ మీద క్లాప్స్. అమ్మాయిలు అయితే భానుమతి క్యారెక్టర్ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. బ్లడ్ లో పవన్ కల్యాణ్, మహేశ్‌ బాబు ఉంటే ఆ కిక్కు వేరుగా ఉంటుంది అని అంటున్న సాయి పల్లవి విపరీతంగా అభిమానించే హీరో మటుకు కోలీవుడ్ టాప్ హీరో సూర్య. తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఫిదా.. ఇప్పుడు కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇక ఫిదా ని కోలీవుడ్ లో.. బాలీవుడ్ లో కూడా రీమేక్ చేయాలని చూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -