- Advertisement -
కండల వీరుడు సల్మాన్ ఖాన్ ముచ్చటగా మూడోసారి ఓ దర్శకుడితో కలిసి సినిమా చేస్తున్నారు. ఆ దర్శకుడే కబీర్ ఖాన్. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్ లో ఏక్ థా టైగర్, బజరంగీ భాయ్ జాన్ చిత్రాలు వచ్చాయి.
ఈ రెండు బాక్సాఫిస్ దగ్గర బంపర్ హిట్ కొట్టాయి. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో మూడో సినిమా రానున్నది. ఇది పూర్తిగా కుటుంబ కధా చిత్రం. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సుల్తాన్ సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా పూర్తికాగానే కొత్త చిత్రం ప్రారంభమవుతుందని సమాచారం. ఇందులో హీరోయిన్లుగా దీపికా పడుకోనే, కత్రినా కైఫ్ లు నటిస్తున్నారని ప్రచారం.