- Advertisement -
రంగస్థలం హిట్తో మంచి జోష్లో ఉన్నాడు రామ్చరణ్.వేసవిని టార్గెట్ చేసుకుని వచ్చిన రామ్ చరణ్ రంగస్థలం సమ్మర్ హిట్ని తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక మాస్ సినిమాల స్పెషలిస్ట్ దర్శకుడు బోయపాటితో తన తరువాత సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్.ఈ సినిమా షూటింగ్ విదేశాలలో జరుపుకుంటుంది.అయితే ఈ సినిమాను సంక్రాంతికి తీసుకురావలని చిత్ర దర్శకుడు బోయపాటి ఆలోచిస్తున్నారు.
సినిమా విదేశాలలో ఎక్కువ భాగం కావడంతో సినిమా లేట్ అవుతుందని సమాచారం.ఎట్టి పరిస్థితులలో సినిమాను జనవరి 9న విడుదల చేయడానిక సన్నాహలు చేస్తున్నారు.అత్యంత భారీ బడ్జెట్ తో తయారవుతున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రామ్చరణ్ సరసన కైరా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది.