Saturday, April 20, 2024
- Advertisement -

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సరిలేరు నీకెవ్వరు టీమ్ సర్ప్రైస్

- Advertisement -

ఈ మధ్యనే ‘మహర్షి’ సినిమాతో మంచి హిట్ ను అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు హ్యాట్రిక్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి ముఖ్య పాత్ర పోషించబోతున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు ఒక ఆర్మీ మేజర్ పాత్రలో నటించబోతున్నారని తెలిసిందే. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్రం పోస్టర్లలో కూడా మిలటరీ ఆఫీసర్ పాత్రలో మహేష్ బాబు కనిపించారు.

తాజాగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా నుంచి ఒక పాటని విడుదల చేశారు దర్శక నిర్మాతలు. సైనికుడి గొప్పతనం గురించి వర్ణిస్తూ సాగే ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ పాట వీడియో లో కూడా మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ అవతారం లో కనిపించాడు. దిల్ రాజు మరియు రామబ్రహ్మం సుంకర సంయుక్తంగా ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా వచ్చే ఏడాది ఈ సంక్రాంతి బరిలో దిగనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -