Thursday, March 28, 2024
- Advertisement -

‘సర్కార్ వారి పాట’ యాక్షన్ ప్లాన్ చేంజ్.. ఎందుకు..?

- Advertisement -

సరిలేరు నీకెవ్వరూ సినిమా సూపర్ హిట్ తర్వాత మహేష్ బాబు సుకుమార్ ని కాదని మరీ చేస్తున్న సినిమా ‘సర్కార్ వారి పాట’.. పరశురామ్ ఈ సినిమా కి దర్శకుడు. చాల వెరైటీ గా ఈ కథ ఉండబోతుందని అంటున్నారు..పరశురామ్ టాలీవువ్డ్ లో ఇంతవరకు రానటువంటి స్టోరీ తో ఈ సినిమా చేస్తున్నాడట.. స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయ్యింది.. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ చాలామందిని ఆకట్టుకుంది.. మహేష్ ని ఇలా మునుపెన్నడూ చూడలేదని నాటున్నారు.. ఈ సినిమా కి తమన్ సంగీతం ప్లస్ అవుతుందని అంటున్నారు.. అంతా సవ్యంగా జరిగితే మహేష్ బాబు నవంబర్ నుంచి అమెరికాలో సర్కారు వారి పాట షూటింగ్ మొదలుపెట్టేవాడు. కానీ ఇప్పుడా అవకాశం లేదని ఇన్ సైడ్ టాక్.

ఇక ఈ సినిమా లో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ని పరిశీలిస్తుండగా, మహేష్ ద్విపాత్రాభినయం చేస్తుండడం విశేషం.. అప్పుడెప్పుడో చిన్నప్పుడు మహేష్ డబుల్ రోల్ లో నటించాడు.. ఇప్పటివరకు అలా నటించలేదు.. దాంతో ఈ సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమా కోసం విలన్ గా బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ని ఆలోచిస్తున్నారట.. అన్ని సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా బాట పడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారట.

ఇక వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కావొచ్చని తెలిసింది. వీసా పనులు ఇంకా పూర్తి కాలేదు. యుఎస్ లో షూటింగ్ అంటే ఇప్పటికీ రిస్కీ వ్యవహారంగానే ఉంది. ఇండియా తరహాలోనే అక్కడా వైరస్ ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. హాలీవుడ్ నిర్మాతలే తమ షూటింగులను వేరే దేశాలకు మార్చుకుంటున్నారు. అలాంటప్పుడు మనం ఇక్కడ నుంచి ఇంతేసి జనాన్ని తీసుకెళ్లడం రిస్కే అని మహేష్ చెప్తున్నాడట.. కథ డిమాండ్ ప్రకారం కొంత భాగం విదేశాల్లోనే తీయాల్సి ఉండటంతో వెళ్లడం తప్ప వేరే ఆప్షన్ లేదు. పోనీ ముందుగా ఇక్కడ తీయాల్సిన ఎపిసోడ్స్ ని తీస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేశారట. కానీ కొందరు కీలక ఆర్టిస్టుల కాల్ షీట్స్ సమస్య వచ్చే అవకాశం ఉండటంతో ప్రస్తుతానికి అలాంటి ప్లాన్ ఏదీ లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -