అరుణ్ మాతేశ్వర్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కెప్టెన్ మిల్లర్. వాస్తవానికి సంక్రాంతికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా పెద్ద చిత్రాలు ఉండటం, థియేటర్లు దొరకని పరిస్థితి నెలకొనడంతో మేకర్స్ దీనిని వాయిదా వేశారు. అయితే తాజాగా కొత్త రిలీజ్ డేట్ని అనౌన్స్ చేశారు. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ కానున్నట్లు కొత్త డేట్ పోస్టర్ని రిలీజ్ చేశారు. తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ మరియు ఆసియన్ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తుండగా ఈ భారీ చిత్రంలో శివ రాజ్ కుమార్, యంగ్ హీరో సందీప్ కిషన్ తదితరులు నటించారు.
ఈ సందర్భంగా దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ మాట్లాడుతూ… కెప్టెన్ మిల్లర్ లో ధనుష్ విశ్వరూపం చూస్తారన్నారు. మాస్కి కనెక్ట్ అయ్యేలా నిర్మాతలకు లాభం చేకూరేలా సినిమా తెరకెక్కించానని తెలిపారు. ఇప్పటివరకు రిలీజైన పోస్టర్స్, ప్రమోషనలో వీడియోలకు మంచి రెస్పాన్స్ రావడంతో ప్రేక్షకులంతా ఎంజాయ్ చేస్తున్నారన్నారు. ధనుష్ సైతం సినిమా కోసం చాలా కష్టపడ్డారని తెలిపారు. కెప్టెన్ మిల్లర్ అనేది ఒక బ్రిటీష్ సైనికుడి కృరత్వాన్ని ఎదురించే ఓ కుర్రాడి కథ నేపథ్యంగా సాగుతుందన్నారు. ధనుష్ ఒక సిన్సియర్ మిలిటెంట్ నుండి ఆవేశపూరిత విప్లవకారుడిగా మారడం చుట్టూ కథ తిరుగుతుందన్నారు.
ధనుష్ , ప్రియాంక మోహన్ పాత్రలు భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వారి ప్రాంతాలలో పోరాడడాన్ని చూస్తారన్నారు. అమాయకులపై పోలీసుల దౌర్జన్యం కూడా ఇందులో కనిపిస్తుందని మొత్తంగా ధనుష్ విశ్వరూపం చూస్తారన్నారు.