Tuesday, May 21, 2024
- Advertisement -

భ‌ర్త‌తో బెడ్రూమ్ ఒప్పందం చేసుకున్న సోన‌మ్‌

- Advertisement -

ఈ రోజుల్లో ప్ర‌తి మ‌నిషి జీవితంలోకి ముఖ్య సాధ‌నం అయింది సెల్‌ఫోన్‌. అస‌లు సెల్‌ఫోన్ లేక‌పోతే బ్ర‌త‌క‌లేనంత‌గా మారింది ప్ర‌పంచం.చాలా కుటుంబాల్లో కలతలు రేగడానికి ప్రధాన కారణాల్లో ఒకటి సెల్‌ఫోన్.సెల్‌ఫోన్‌తో ఏర్పడే బంధాలు, బాంధవ్యాలు వివాహమైన జంటల మధ్యన విబేధాలు రేపుతూ ఉండటాన్ని చూస్తుంటాం.ఇలాంటి స్మార్ట్ ఫోన్ విషయంలోనే కఠినమైన నిర్ణయం తీసుకుంది బాలీవుడ్ హీరోయిన్ సోన‌మ్ క‌పూర్‌.

ఆనంద్ అహూజా అనే వ్యాపార‌వేత్త‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది సోనమ్ కపూర్.ప్రస్తుతం వీరి పెళ్లి వేడుకలు జ‌రుగుతున్నాయి.పెళ్లి విషయాన్ని ప్రకటించిన ఇంటర్వ్యూలో సోనమ్ ఒక ఆసక్తిదాయకమైన విషయాన్ని చెప్పింది.వివాహం తర్వాత వీరిద్ద‌రు త‌మ ప‌డ‌క గ‌దిలోకి సెల్‌ఫోన్ తీసుకురాకుడ‌ద‌ని ఒప్పందం చేసుకున్నార‌ట‌! బెడ్రూమ్‌కు వెళ్లే సమయానికి ఫోన్‌ని బ‌య‌టే పట్టేయ‌ల‌ని వీరిద్ద‌రు ఒక రూల్ పెట్టుకున్నారని సోన‌మ్ చెప్పుకొచ్చింది.

వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతూనే సోనమ్, ఆనంద్‌లు చాలా మంచి నిర్ణ‌యం తీసుకున్నార‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.ఈ ఐడియాని ప్ర‌తి ఒక్క‌రు పాటిస్తే భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య ఎటువంటి గొడ‌వ‌లు ఉండ‌వ‌ని చాలా మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -