Tuesday, April 30, 2024
- Advertisement -

ఘనంగా సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్

- Advertisement -

సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ 2024 వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. హైదరాబాద్ హరిహర కళాభవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు హాజరయ్యారు. వివిధ కేటగిరిల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన వారికి అవార్డులు దక్కాయి.

ఉత్తమ దర్శకుడిగా బింబిసార వశిష్టకు, నాటు నాటు పాటకు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ కు, నటుడు మాణిక్ కి, కమెడియన్ గా రచ్చ రవికి, బెస్ట్ సపోర్టింగ్ రోల్ గా డీజే టిల్లులో మురళీధర్ గౌడ్ కి అవార్డులు వచ్చాయి. అలాగే మా ఊరి సినిమాకు గాను బెస్ట్ యాక్ట్రెస్ గా నేహా రెడ్డికి, పుష్పలో బెస్ట్ విలన్ గా అజయ్ ఘోష్ కి అవార్డులు దక్కాయి.

టాలీవుడ్ లో టాలెంట్ అవార్డ్స్ ఇవ్వడం ఇది మూడోసారి అన్నారు సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ చైర్మన్ సంజోష్ . ఇకపై కూడా ప్రతి ఏడాది ఈ అవార్డ్స్ ను తమ సంస్థ నుంచి అందిస్తాం అని తెలిపారు. సినీ ప్రముఖులంతా ఒక్కచోటే చేరడంతో కార్యక్రమం ఆధ్యాంతం సందడిగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -