Tuesday, May 14, 2024
- Advertisement -

స్పైడర్ ఫస్ట్ రివ్యూ.. ఇచ్చిన సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్

- Advertisement -

మహేష్ బాబు, మురుగదాస్ కాంబోలో వస్తున్న సినిమా స్పైడర్. ఈ సినిమా కోసం సౌత్ ఇండియా మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇక మరి కొద్ది గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి మొదటి రివ్యూ వచ్చేసింది.

ఇండియ‌న్ సినిమాల విడుదలకు ముందే వాటి రివ్యూ, రేటింగ్స్ చెప్పేసే దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడు, మూవీ మార్కెటింగ్ నిపుణుడు ఉమైర్ సంధు స్పైడ‌ర్ సినిమా ఫ‌స్ట్ రివ్యూతో పాటు రేటింగ్ కూడా ఇచ్చేశాడు. ఇక స్పైడర్ మూవీ అదిరిపోయే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ అని తెగ పొగిడేశాడు. స్పైడర్ లో హీరో, విలన్ ల మధ్య మైండ్ గేమ్ తో సినిమా నడుస్తోందట. తాను ఎవ్వరో తెలియకుండా స‌మాజానికి హానికలిగిస్తూ పెద్ద ప్ర‌మాదికారిగా మారిన విల‌న్ ఆట‌ను హీరో క‌ట్టించాడు అన్న‌దే స్పైడ‌ర్ స్టోరీ అని ఉమైర్ చెప్పాడు. ఇక విలన్ ను కనిపేట్టేందుకు.. హీరో వేసే ఎత్తులు.. పై ఎత్తులు సినిమాలో చాలా బాగున్నాయని.. ఇక సినిమా మొత్తానికి క్లైమాక్స్ అదిరిపోతుందని చెప్పాడు. ఈ క్లైమాక్స్‌కు ప్ర‌తి ఒక్క‌రు మెస్మ‌రైజ్ అయిపోతార‌ట‌. అటు క్లాస్ ను, ఇటు మాస్ ను అలరించే విధంగా తయారైన ‘స్పైడర్’, ఈ దసరాకు బ్లాక్ బస్టరేనని తేల్చారు.

ఇక మహేష్ ఎప్పటిలాగానే తనదైన స్టైల్లో నటన కనబర్చారని.. ఇక విలన్ గా చేసిన ఎస్‌.జె.సూర్య యాక్టింగ్ కూడా పీక్ స్టేజ్‌లో ఉంటుందని ఉమైర్ చెప్పారు. హీరోయిన్ రకుల్ ప్రిత్ సింగ్ తన పాత్రకు న్యాయం చేసిందని.. చెప్పారు. దసరాకు మహేష్ అభిమానులకు ఈ సినిమా పెద్ద పండగే అని.. చెప్పిన ఉమైర్ స్పైడ‌ర్‌కు 3.5 / 5 రేటింగ్ ఇచ్చాడు. ఆయన ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ సినిమాకు కూడా ఇదే రేటింగ్ ఇచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -