టాలీవుడ్ వివాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి తన వాఖ్యలతో వార్తల్లో నిలిచింది. కాస్టింగ్ కౌచ్పై పోరాటం చేసిన శ్రీరెడ్డి ,అప్పట్లో తెలుగు ఇండస్ట్రీపై తీవ్ర విమర్శలు చేసింది.ఆధారాలు లేకుండా విమర్శలు చేయడంతో ఆమెను మీడియా సైతం పట్టించుకోవడం మానేసింది.దీంతో తమిళ ఇండస్ట్రీ ఫోకస్ పెట్టింది శ్రీరెడ్డి.అక్కడ కొందరి ఫేమస్ నటులపై కొన్ని ఘాటు విమర్శలు చేసి అక్కడ మీడియాను తన వైపు తిప్పుకుంది.శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ తమిళ ఇండస్ట్రీ మొత్తం షాక్ గురైంది.ఆధారాలు ఉంటే పోలీస్ స్టేషన్కు వెళ్లాలి కాని, ఇలా మీడియాకు ఎక్కడం ఏంటీ అని కొందరు ప్రశ్నించారు. ఇప్పుడు శ్రీరెడ్డి కన్ను మళ్లీ టాలీవుడ్పై పడింది. తాజాగా ప్రముఖ హాస్య నటుడిపై శ్రీరెడ్డి చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపాయి.
శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ పేజీలో కమెడియన్ ఫృథ్వీపై సంచలన కామెంట్స్ చేసింది. ‘బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో నీ గోకుడు యవ్వారాల గురించి తెలియదా’ అంటూ ఆరోపణలు చేసింది. నీ బాగోతం గురించి అమెరికా ఈవెంట్స్ కి వచ్చిన అమ్మాయిలకు కూడా తెలుసు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.ఫృథ్వీని ముసలి నక్క అని సంబోధిస్తూ శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘ఈ ముసలి నక్కకు ఎమ్మెల్యే టికెట్ కావాలంటా’ అంటూ ఎద్దేవా చేసింది. గురువింద గింజ గు******* అక్కడ పెట్టుకో అంటూ రాయలేని తిట్ల తో శ్రీరెడ్డి బూతు వ్యాఖ్యలు చేసింది.ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో కమెడియన్ ఫృథ్వీ శ్రీరెడ్డిపై విమర్శలు చేశారు.తన దృష్టిలో శ్రీరెడ్డి అసలు ఆడదే కాదంటూ సంచలన కామెంట్స్ చేశాడు. కనీసం ట్రాన్స్ జెండర్ కూడా అలాంటి వ్యాఖ్యలు చేయరని విమర్శించారు. దీంతో శ్రీరెడ్డి కమెడియన్ ఫృథ్వీపై ఇలాంటి కామెంట్స్ చేసిందని అంత అనుకుంటున్నారు.