టాలీవుడ్ వివాస్పద నటి శ్రీరెడ్డి తరుచు ఏదో ఒక వివాదంలో ఉంటునే ఉంటుంది.శ్రీరెడ్డి మరోసారి తన మాటలతో వార్తల్లో నిలిచింది.టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్పై సంచలన కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి. రాజేంద్రప్రసాద్ మానసిక రోగి అని, అతడిని మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేయాలని తన ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి .రాజేంద్రప్రసాద్ కామపిశాచి అంటూ… ”మిస్టర్ రాజేంద్రప్రసాద్ ఆరు నెలల్లోనే మా అసోసియేషన్ నుండి ఎందుకు బయటకి వచ్చేశావో అందరికీ తెలుసు.
హీరోయిన్ మాళవిక ఇండస్ట్రీని ఎందుకు వదిలేసి వెళ్ళిపొయిందో అందరికీ తెలుసు.. నువ్వు ఆమెని ఎంతగా వేధించావో.. మహిళా ఆర్టిస్టులని నీ కోరికలు తీర్చమని ఎంతగా ఇబ్బంది పెట్టావో అందరికీ తెలుసు అని చెప్పుకొచ్చింది.నీ గురించి తెలిసే నీ కూతురు ఇంటి నుంచి పారిపోయింది… నటి హేమ నీతో ఎందుకు గొడవ పడింది..? ఓ సీనియర్ నటుడిగా మిమ్మల్ని గౌరవిస్తాను కానీ ఓ మనిషిగా మాత్రం కాదు” అంటూ రాజేంద్రప్రసాద్పై వివాస్పద కామెంట్స్ చేసింది.ఇప్పటి వరకు హీరోలను,కామెడియన్లను టార్గెట్ చేసిన శ్రీరెడ్డి ,ఇప్పుడు సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్లను కూడా వదలడం లేదు.