Wednesday, May 15, 2024
- Advertisement -

శ్రీదేవిది పక్కా హత్యే :పోలిస్ కమిషనర్

- Advertisement -

అతిలోక‌సుంద‌రి హీరోయిన్ శ్రీదేవి ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో దుబాయ్‌లోని ఒక హోటల్‌లో మరణించిన సంగ‌తి తెలిసిందే.సన్నిహితుల పెళ్లికి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి అక్క‌డ జ‌రిగిన వేడ‌క‌లో అతిగా మ‌ద్యం సేవించి బాత్‌రూంలో కాలు జారిప‌డి మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. అయితే శ్రీదేవి ఇలా మ‌ర‌ణించ‌డంపై చాలామందికి అనుమానం వ‌చ్చింది.శ్రీదేవిది స‌హ‌జ మ‌ర‌ణం కాద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.ఈ విష‌యంలో దుబాయ్ పోలీసులు కూడా క్లారీటి ఇవ్వ‌లేదు.

హ‌డ‌విడిగా శ్రీదేవి అంత్య‌క్రియ‌లు పూర్తి చేశారు.అయితే శ్రీదేవిది స‌హ‌జ మ‌ర‌ణం కాద‌ని అంటున్నారు ఢిల్లీ మాజీ పోలిస్ అసిస్టెంట్ కమిషనర్. శ్రీదేవి మరణంపై తను పరిశోధించాన‌ని దీని కోసం ప్రత్యేకంగా దుబాయ్ వెళ్లి వచ్చానని, శ్రీదేవి చివరగా బస చేసిన హోటల్‌లోనే తను కూడా బస చేశానని, ఆమె రూమ్‌ను పోలిన మరో రూమ్‌ను తీసుకుని అక్కడ ఆమె మరణించిన పరిస్థితుల గురించి పరిశోధించానని చెబుతున్నాడు. శ్రీదేవి మరణించిన తీరును చూస్తే ఆమెది సహజమరణం కాకపోవచ్చని తన పరిశోధనలో తేలిందని చెబుతున్నాడు ఈ మాజీ పోలిస్ .

ఒక మనిషిని బాత్‌టబ్‌లో ముంచి, ఊపిరి ఆడనీయకుండా చేసి హతమార్చడం కష్టం కాదు అని ఈయన అంటున్నాడు. శ్రీదేవి విషయంలో కూడా అదే జరిగి ఉండవచ్చునని, పక్కా ప్రణాళికతో ఆమెను ఎవరైనా హత్య చేసి ఉండే అవకాశముందని అంటున్నాడు. సాక్ష్యాధారాలు దొరకకుండా వారు తెలివిగా హత్య చేశారని చెబుతున్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -