ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమైంది రంగస్థలం మూవీ. సుకుమార్ దర్శకత్వలో రామ్చరణ్ హీరోగా,సమంతా హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయ్.. నాపేరు చిట్టిబాబు అండీ.. ఈ ఊరికి మనమే ఇంజనీర్.. అందరికీ సౌండ్ వినపడుద్దండీ.. నాకు సౌండ్ కనపడుద్దండీ.. ‘రంగస్థలం’ టీజర్తో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసిన చిట్టిబాబు తాజా ట్రైలర్తో ఆ అంచనాలకు రెట్టింపుచేశాడు. ‘
సిట్టిబాబుగాడి సెవిలోకి మాట ఎల్లడం కష్టం కానీ, ఒక్కసారి ఎల్లిందంటే ఆ మాట అక్కడే ఉండిపోద్దయ్యా!’ అంటూ ఆదివారం నాడు విడుదలైన ట్రైలర్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు చిట్టిబాబు. విడుదలైన కొన్ని గంటల వ్యవధిలోనే 3,565,665 మంది వీక్షించడంతో యూట్యూబ్ టాప్ ట్రెండ్ లిస్ట్లో మొదటి స్థానంలో ఉంది రంగస్థలం ట్రైలర్.
ఆదివారం నాడు జరిగిన ప్రి రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చేతుల మీదుగా విడుదలైన ‘రంగస్థలం’ ట్రైలర్ కు కు విశేషమైన స్పందన లభిస్తోంది. అటు మెగా అభిమానులతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం సిట్టిబాబు చితక్కొట్టేశాడంటూ సోషల్ మీడియాలో వరుస ట్వీట్స్ చేస్తున్నారు.
తాజాగా దర్శకధీరుడు రాజమౌళి ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. రంగస్థలం’ ట్రైలర్తో చిట్టిబాబు మరింత ప్రియంగా మారారన్నారు. ఈ ట్రైలర్తో అతనితో ఉన్న ఎఫెక్షన్ మరింత పెరిగిందన్నారు. చిట్టిబాబు ఎప్పుడొస్తాడా అని వెయిట్ చేస్తున్నా.. జేబీ (జగపతిబాబు) పాత్రలో ఒదిగిపోయి చాలా గంభీరంగా ఉన్నారంటూ ట్వీట్ చేశారు.
Chittibabu is becoming dearer and dearer.. Trailer did only increase the affection towards him. JB is menacing. Eagerly waiting for the release.. #Rangasthalam https://t.co/KLoFvhqWXW
— rajamouli ss (@ssrajamouli) March 19, 2018