నందమూరి బాలకృష్ణ హోస్ట్గా ఆహా ఓటీటీలో ప్రసారం అవుతున్న షో అన్స్టాపబుల్. ఇప్పటివరకు రెండు సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో టాప్ రేటింగ్తో దూసుకుపోతోంది. ప్రస్తుతం లిమిటెడ్ ఎడిషన్గా ప్రేక్షకుల ముందుకురాగా రీసెంట్గా యానిమల్ చిత్ర యూనిట్ సందడి చేసింది. ఇక ఈ ఎపిసోడ్కి రికార్డు వ్యూస్ రాగా నెక్ట్స్ ఎపిసోడ్ని అంతకుమించి ఉండేలా ప్లాన్ చేశారు మేకర్స్.
ఈసారి గెస్ట్లు గా సీనియర్ నటి సుహాసిని, శ్రియ, డైరెక్టర్ జయంత్ సి పరాన్జీ, హరీష్ శంకర్ రానున్నారు. ఇందుకు సంబంధించిన ప్రొమోను విడుదల చేశారు. ఈ ప్రొమోలో సుహాసిని, శ్రియా ఇద్దరితో డ్యాన్స్ చేసి అలరించారు బాలయ్య. ప్రధానంగా సుహాసినితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తనది,సుహాసినిది జన్మజన్మల బంధం.. శ్రియాది ఈ మిలీనియం బంధం అని తనదైన శైలీలో చెప్పుకొచ్చారు బాలయ్య.
మాకు మాకు పాత కక్షలు ఉన్నాయయ్యా అంటూ జయంత్కి కౌంటర్ ఇవ్వగా హరీష్ శంకర్తో ఏంటి హాలీడేసా ఫ్రీగా ఉన్నావు? అని ప్రశ్నించగా ఈ గ్యాప్ మటుకే వెకేషన్.. సినిమా రిలీజైన తర్వాత సెన్సేషన్ అంటూ పవన్తో సినిమా గురించి రివీల్ చేశారు హరీష్. ఇక ఈ ప్రొమో ఆధ్యంతం ఆసక్తికరంగా సాగగా ఆహాలో డిసెంబర్ 22 నుండి స్ట్రీమింగ్ కానుంది. .