Saturday, May 4, 2024
- Advertisement -

భ‌ర్త మ‌ర‌ణంపై తొలిసారి స్పందించిన న‌టి సుమ‌ల‌త‌

- Advertisement -

ప్రముఖ నటుడు అంబరీశ్ ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణంపై భార్య న‌టి సుమ‌లత తొలిసారి స్పందించారు. సుమలత శనివారం నాడు సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టారు.కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ తన వరుస ట్వీట్స్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. వరుసగా మూడు రోజుల పాటు పోలీసు అధికారులు, జిల్లా అధికారులు చాలా కష్టపడ్డారని ఆమె పేర్కొన్నారు.

‘ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటి కష్టకాలంలో మీరు చూపిన ప్రేమ, సానుభూతి మాకు ధైర్యాన్ని ఇచ్చాయి. అంబరీశ్‌కు ఘనంగా వీడ్కోలు చెప్పిన కర్ణాటక ప్రజలకు, అభిమానులకు నేను, నా కుమారుడు అభిషేక్, అలాగే అంబరీశ్ కుటుంబం మొత్తం మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. అంతిమ వీడ్కోలు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా చూసేందుకు వరుసగా మూడు రోజులు పోలీసు అధికారులు, జిల్లా అధికారులు చాలా కష్టపడ్డారని వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది సుమ‌ల‌త‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -