Tuesday, May 7, 2024
- Advertisement -

ప్లాప్ హీరో కి హిట్ ఇవ్వనున్న స్టార్ ప్రొడ్యూసర్

- Advertisement -

ఒక నిర్మాతగా ఎమ్మెస్ రాజు చాలామంది హీరోలకి మర్చిపోలేని హిట్లు అందించారు. కానీ ఆయన కొడుకు గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సుమంత్ అశ్విన్ మాత్రం కేవలం డిజాస్టర్ లే చవిచూసాడు. తాజాగా ‘హ్యాపీ వెడ్డింగ్’ సినిమాతో మరొక డిజాస్టర్ ను అందుకున్న సుమంత్ అశ్విన్ ఇప్పుడు ఒక పాపులర్ దర్శకుడితో చేతులు కలపనున్నాడు. అతనే డైరెక్టర్ వి.ఎన్.ఆదిత్య. ‘మనసంతా నువ్వే’, ‘నేనున్నాను’, ‘ఆట’ వంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ వి ఎన్ ఆదిత్య ఇప్పుడు సుమంత్ అశ్విన్ హీరోగా ఒక సినిమాకి దర్శకుడిగా మారబోతున్న వార్తలు వినిపిస్తున్నాయి.

గత కొంతకాలంగా అమెరికాలో ఉంటున్న మెయిన్ స్ట్రీమ్ సినిమాలకి దూరంగా ఉంటున్న వి.ఎన్.ఆదిత్య ఇప్పుడు మళ్ళీ సుమంత్ అశ్విన్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్నారు. ఎం.ఎస్.రాజు కోరికమేరకు ఆదిత్య సుమంత్ అశ్విన్ తో సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాత ఎవరు అని ఇంకా తెలియాల్సింది. దగ్గుబాటి సురేష్ బాబు ఈ సినిమా సమర్పిస్తున్నారు. ఎమ్మెస్ రాజు రిక్వెస్ట్ చేయడంతో సురేష్ బాబు సినిమా సమర్పించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్ళే ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -