Monday, May 6, 2024
- Advertisement -

ప్ర‌భుదేవా తండ్రి శవాల ద‌గ్గ‌ర డ్యాన్స్ వేసేవార‌ట‌..!

- Advertisement -

ప్ర‌ముఖ డ్యాన్స్ మాస్ట‌ర్ ప్ర‌భుదేవా తండ్రి సుంద‌రం కూడా డ్యాన్స‌ర్ మాస్ట‌ర్ అన్న సంగ‌తి తెలిసిందే.తాజాగా ఆయ‌న ఈటీవీలో ప్ర‌సార‌మ‌య్యే ఆలీతో జాలీగా అనే షోకి వ‌చ్చారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న జీవిత విశేషల‌తో పాటు ,త‌న సినీ ప్ర‌స్థానం గురించి చెప్పుకొచ్చారు. సుంద‌రం మాస్ట‌ర్‌కు ముగ్గురు కుమారులు. ప్రభుదేవా .. రాజు సుందరం .. ప్రసాద్‌.. ఈ ముగ్గురు కూడా డ్యాన్స్ మాస్ట‌ర్లే కావ‌డం విశేషం.ఇక త‌న‌కు అస‌లు డ్యాన్స్ రాద‌ని ,శవాల ద‌గ్గ‌ర డ్యాన్స్‌లు వేసేవాడిన‌ని చెప్పుకొచ్చారు.మ్యూజిక్‌ను బ‌ట్టి స్టెప్పులు వేయ‌డం శవాల ద‌గ్గ‌రే నేర్చుకున్నాన‌ని తెలిపారు సుంద‌రం మాస్ట‌ర్‌.ఇక సినిమా చూడ‌టానికి బాగానే ఉంటుంద‌ని,కాని వ‌చ్చి చూస్తే తెలుస్తుంది అక్క‌డ ఎన్ని క‌ష్టాలు ఉంటాయో.. నాకు ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన‌ త‌రువాతే తెలిసింద‌ని చెప్పారు.

ఎలాగైనా చిత్ర పరిశ్రమలోకి రావాలనే పట్టుదలతో నేను చాలా ప్రయత్నాలు చేశాను గానీ ఫలించలేదు. వాహినీ స్టూడియోస్ వారు ‘చందమామ’ ప్రెస్ నడుపుతుండేవారు. ఆ ప్రెస్ లో పేపర్లు అందించేవాడిగా పనిచేశాను. నెలకి 40 రూపాయలు జీతంగా ఇచ్చేవారు. ఆ 40 రూపాయల్లో నుంచి ఒక 10 రూపాయలు పెట్టి నాకు ఇష్టమైన డాన్స్ ను నేర్చుకునేవాడిని” అని చెప్పుకొచ్చారు. అంద‌రిలా నా కొడుక‌ల‌ను విదేశాల‌లో చ‌దివించ‌లేద‌ని ,చైన్నై ప్ర‌భుత్వం క‌ళాశాల‌లోనే వారిని చ‌దివించాన‌ని చెప్పుకొచ్చారు సుంద‌రం మాస్ట‌ర్‌.త‌న ముగ్గురు కొడుకులు ఉన్న‌త స్థితిలోనే ఉన్నార‌ని,ముగ్గురు నాకు మంచి పేరు తెచ్చిపెట్టార‌ని తెలిపారు.ఇక ప్ర‌భుదేవా గురించి అడ‌గ్గా .వాడు మొద‌టి నుంచి డ్యాన్స్ అంటే పిచ్చితోనే ఉండేవాడు,ముగ్గురిలో కాస్తా ముభావంగా ప్రభుదేవానే ఉండేవారని చెప్పారు సుంద‌రం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -