Friday, April 26, 2024
- Advertisement -

పవన్ కోసం తాజ్ మహల్ కట్టారు.. ఎక్కడంటే ?

- Advertisement -

బడా హీరో ఉండాలే కానీ బడ్జెట్ విషయంలో టాలీవుడ్ నిర్మాతలు అసలు వెనకడారు. బాలీవుడ్ సినిమాల కంటే ఎక్కువ ఖర్చు పెట్టేందుకు ముందుకు వస్తారు. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలకు విపరితమైన బడ్జెట్ ను ఖర్చు చేస్తున్నారు మన నిర్మాతలు. ఈ మధ్య కాలంలో బడా హీరోల సినిమాలు చూస్తే ఆ ఖర్చు మనకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది.

ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘పింక్’ రీమేక్ కు కూడా నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ ను పెడుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా పూర్తి అవ్వాలనే ఉద్దేశ్యంతో ఔట్ డోర్ షూటింగ్స్ కంటే ఎక్కువగా భారీ సెట్టింగ్స్ వేసి ఇండోర్ లోనే నిర్వహించాలని భావిస్తున్నారట. అందుకే ఈ చిత్రంలోని కీలక సన్నివేశాల కోసం భారీ స్థాయిలో తాజ్ మహల్ సెట్టింగ్ ను వేయబోతున్నారట. అలాగే చార్మినార్ సెట్టింగ్ ను కూడా నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది.

హైదరాబాద్ శివారు ప్రాంతంలోని అల్యూమీనియం ఫ్యాక్టరీ లో ఈ చిత్రం కోసం భారీ ఎత్తున సెట్టింగ్స్ ను నిర్మించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే ఈ సినిమా లో కీలకమైన ఇతర సీన్స్ తీసేందుకు వీధి సెట్లు మరియు కోర్టు సెట్ ను కూడా నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి సినిమాని తొందరగా కంప్లీట్ చేసేందుకు దిల్ రాజు ఖర్చు వెనకడటం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -