Sunday, May 5, 2024
- Advertisement -

వ్యూహం సినిమాపై టీడీపీ గుండాగిరి!

- Advertisement -

ఏపీ సీఎం జగన్ రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం వ్యూహం. రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించగా సెన్సార్ అడ్డంకులు దాటుకున్న వ్యూహం సినిమా క్లీన్ యూ సర్టిఫికెట్ పొందింది. ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించగా,వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించనుంది.

ఇక ఈ సినిమా విషయంలో ఇప్పటికే ఆర్జీవీ వర్సెస్ టీడీపీ కార్యకర్తల మధ్య వార్ నడుస్తోంది. తాజాగా ఫిలీం నగర్‌లోని రాంగోపాల్ వర్మ కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తలు గుండాయిజాన్ని ప్రదర్శించారు. వ్యూహం సినిమా పోస్టర్లను తగలబెట్టారు. పోలీసుల ఎంట్రీతో టీడీపీ కార్యకర్తలు అక్కడి నుండి పరారయ్యారు.

సినిమాను సినిమాగానే చూడాలని నిర్మాత దాసరి కిరణ్ తెలిపారు. సెన్సార్ బోర్డు సర్టిఫై చేసిన తర్వాత టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగడం బాధాకరమని, రౌడీయిజం, దాడులు ప్రజాస్వామ్యంలో మంచిది కాదని తెలిపారు. టీడీపీ శ్రేణుల దాడులను ఖండిస్తున్నట్లు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -