రియాల్టీ షో బిగ్బాస్ నేషనల్ లేవల్లో క్రేజ్ సంపాదించింది.మొదట హిందీలో ప్రారంభమైన ఈ రియాల్టీ షో తరువాత తెలుగు, తమిళ, మలయాళ బాషలలో కూడా ప్రారంభించారు.బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ వ్యవహారిస్తుండగా,తెలుగులో నాని,తమిళంలో కమల్ హాసన్,మలయాళంలో మోహన్ లాల్ లు వాఖ్యాతలుగా చేస్తున్నారు.తెలుగు, తమిళ, మలయాళంలో రెండో సీజన్ నడుస్తుండగా ,బాలీవుడ్లో ఇప్పటికే ఈ షో 11 సీజన్లను పూర్తి చేసుకొని 12వ సీజన్లోకి ఎంటర్ అయింది. బాలీవుడ్లో ఈ నెల 16 నుంచి12వ సీజన్ ప్రారంభం కానుంది.అయితే ఇప్పుడు ఈ షోలో ఎవరు పాల్గొనున్నారనే విషయంలో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి.
తను శ్రీ దత్తా, తన సోదరితో కలిసి ఈ షోలో పాల్గొనుందని సమాచారం. అలానే కమెడియన్ భారతి తన భర్తతో కలిసి ఈ షోలో పాల్గొనడానికి వారానికి రూ.50 లక్షలు డిమాండ్ చేసిందని తెలుస్తుంది.తాజాగా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ పేరు కూడా వినిపిస్తోంది.మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా జీవితకాల నిషేధం ఎదుర్కొన్న శ్రీశాంత్ బిగ్బాస్ షోలో పాల్గొనున్నట్లు సమాచారం. ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన శ్రీశాంత్ మ్యాచ్ ఫిక్సింగ్ స్కామ్ లో జైలు జీవితం కూడా గడిపాడు. శ్రీశాంత్ బిగ్బాస్లో ఉంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.శ్రీశాంత్ కనుక బిగ్బాస్లో పాల్గొంటే షోపై మరింత హైప్ క్రియేట్ ఖాయం అని కొందరు భావిస్తున్నారు.