Saturday, April 20, 2024
- Advertisement -

వర్మ కు మరో షాక్.. దిశ మూవీపై వివరణ ఇవ్వాలి : హై కోర్టు

- Advertisement -

సంచల దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎప్పటికప్పుడు తన విచిత్రమైన పనులతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంటారు. దిశ అత్యాచారం, హత్య, నిందితుల ఎన్​కౌంటర్ ఆధారంగా ఆర్జీవీ సినిమా తీయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమె తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమాపై సెన్సార్ బోర్డు నిర్ణయం తీసుకోకముందే కోర్టును ఎందుకు ఆశ్రయించారని పిటిషనర్‌ను కోర్టు ప్రశ్నించింది.. టీజర్ ను సోషల్ మీడియాలో విడుదల చేస్తున్నట్లు వర్మ ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దిశ తండ్రి పేర్కొన్నారు.

సినిమా తమ కుటుంబాన్ని మనోవేదనకు గురి చేసేలా కనిపిస్తోందని.. ట్రైలర్​పై యూట్యూబ్​లో ఉన్న కామెంట్లు ఇబ్బందికరంగా ఉన్నాయని తెలిపారు. సెన్సార్ బోర్డును ఆశ్రయించాలని సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేసి.. సినిమా చిత్రీకరణ, విడుదలను ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనాన్ని కోరారు.

ఇది ఇలా ఉండగా ఆ ఆధారంగా చేసుకొని రామ్ గోపాల్ వర్మ ‘దిశ ఎంకౌటర్ ‘ అనే సినిమాను తెరకెక్కించారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఈ నెల 26వ తేదీన విడుదల చేసేందుకు వర్మ ఏర్పాట్లు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -