Wednesday, May 15, 2024
- Advertisement -

పోలీసుల‌కు థ్యాంక్స్ చెప్పేసిన క‌పూర్ ఫ్యామిలీ

- Advertisement -

అందాల తార శ్రీదేవి మృతి వార్త నుంచి శ్రీదేవి భౌతిక‌కాయం ముంబాయి రావ‌డం.. అంత్య‌క్రియ‌లు ప్ర‌శాంతంగా పూర్త‌వ‌డానికి పోలీసులు విశేష కృషి చేశారు. పోలీసుల స‌హ‌కారంతో శ్రీదేవి అంతిమ యాత్ర సజావుగా.. ప్ర‌శాంతంగా ముగిసింది. అయితే ఈ విష‌య‌మై బాలీవుడ్‌ నటుడు, బోని క‌పూర్ సోద‌రుడు అనిల్‌ కపూర్‌ ముంబయి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

అలనాటి నటి శ్రీదేవి హఠాన్మరణం చెందిన నేపథ్యంలో పోలీసులు కపూర్‌ కుటుంబానికి రక్షణగా నిలిచారు. శ్రీదేవి చనిపోయారని తెలిసిన రోజు నుంచి అంత్యక్రియలు జరిగే వరకు ముంబయి పోలీసులు భద్రత కట్టుదిట్టం చేయ‌డంతోపాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్నీ దగ్గరుండి చూసుకోవ‌డంతో అనిల్‌ కపూర్ పోలీసుల‌కు ప్ర‌త్యేక కృతజ్ఞతలు తెలిపారు.

‘మేము బాధపడుతుంటే.. స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు రక్షణగా మా వెన్నంటే ఉంటూ మమ్మల్ని ప్రశాంతంగా దుఃఖించేందుకు దోహదపడ్డారు. ఈ నేపథ్యంలో ముంబయి పోలీసులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. అన్ని వేళల్లో మా వెన్నంటే ఉన్నారు. మమ్మల్ని అర్థంచేసుకున్నందుకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.అనిల్‌ ట్వీట్‌కు ముంబయి పోలీసులు స్పందించారు. ‘ఈ విషాద సమయంలో మేమంతా మీ కుటుంబానికి అండగా ఉంటాం’ అని పేర్కొన్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -