Friday, March 29, 2024
- Advertisement -

ఆమని మళ్లీ నటించడానికి కారణం ఏంటో తెలుసా ?

- Advertisement -

నరేష్ హీరోగా ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ’జంబలకిడిపంబ’. ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఆమని. ఆ తరువాత ‘మిస్టర్ పెళ్ళాం’ ‘శుభలగ్నం’ ‘శుభమస్తు’ ‘మావిచిగురు’ ‘వంశానికొక్కడు’ ‘శుభ సంకల్పం’ వంటి హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాధించుకుంది.

ఆ రోజుల్లో జగపతిబాబు, ఆమని కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉండేది. అయితే ఆమని కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడే ఓ తమిళ నిర్మాతను ప్రేమించి పెళ్లి చేసుకుంది. దాంతో సినిమాలను తగ్గించేసింది. అటు తరువాత తన భర్త నిర్మించిన చాలా సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి. దాంతో అప్పులు ఎక్కువయ్యాయి. ఆ టైములో వీళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారట. ఒకానొకసారి అయితే ఆమని భర్త సూసైడ్ చేసుకోవడానికి కూడా రెడీ అయిపోయాడట.

దాంతో ఇక ఎటూ తోచక మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిందట ఆమని. హరికృష్ణ హీరోగా నటించిన ‘స్వామి’, రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ‘మధ్యాహ్నం హత్య’, రాజేంద్రసాద్ ‘ఆ నలుగురు’, ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో వచ్చిన ‘చందమామ కథలు’, నాని హీరోగా వచ్చిన ‘ఎం.సి.ఏ(మిడిల్ క్లాస్ అబ్బాయి)’, మహేష్ బాబు ‘భరత్ అనే నేను’, నితిన్ ‘శ్రీనివాస కళ్యాణం’, రామ్ నటించిన ‘హలో గురు ప్రేమ కోసమే’ వంటి చిత్రాల్లో ఆమని నటించింది. ‘చందమామ కథలు’ చిత్రంలో అయితే సీనియర్ హీరో నరేష్ కు లిప్ లాక్ ఇచ్చే సీన్ లో కూడా నటించింది.

పెళ్లి గురించి చెప్పిన హీరోయిన్ మాధవీలత..!

పదేళ్ల పెళ్లి బంధంపై అనసూయ ఏం అన్నాదంటే ?

మీరా చోప్రాకు కౌంటర్ ఇస్తూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మద్దతు ఇచ్చిన ఖుష్బూ..!

హీరో సాయిరాం శంకర్ ఫ్యామిలీని చూశారా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -