మెగా మేనల్లుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచియమైయ్యాడు సాయి ధరమ్ తేజ్. మొదటి సినిమా రేయ్ ఫ్లాప్ అయినప్పటికి రెండో సినిమా పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో హిట్ కొట్టాడు. ఆ తరువాత వచ్చిన సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ సినిమాలు ఘన విజయం సాధించాయి. దీంతో మనోడికి తిరుగులేదని అందరు భావించారు. కాని సీన్ ఒక్కసారిగా మారిపోయింది. తిక్క సినిమాతో సాయి ధరమ్ తేజ్ కెరీర్ బాగా డ్యామేజ్ అయింది. ఆ తరువాత వచ్చిన సినిమాలు అన్ని ఫెయిల్ కావడంతో, మనోడు రేస్లో వెనుకపడిపోయాడు.మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించి చేతులు కాల్చుకున్నాడు. స్టార్ దర్శకుడు వివి.వినాయక్తో సినిమా చేసినప్పటికి సేమ్ రిజల్ట్ వచ్చింది. దీంతో మనోడు ప్రేమకథలు వైపు మొగ్గు చూపాడు.
ప్రేమ కథల స్పెషలిస్ట్ దర్శకుడు అయిన కరుణకరన్తో తేజ్ ఐ లవ్య్వూ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సాయి ధరమ్ తేజ్. ఈ సినిమా కూడా ఫెయిల్ కావడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నాడు. తనతో పాటు ఇండస్ట్రీకి పరిచియమైన మరో మెగా హీరో వరుణ్ తేజ్ మాత్రం తనకు సూట్ అయ్యే కథలను ఎంచుకుంటు వరస హిట్లు అందుకుంటున్నాడు. దీంతో సాయి ధరమ్ తేజ్పై ఒత్తిడి పెరిగిపోతుంది. ఇక దర్శకులు కూడా తేజు అంటే పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. ఇప్పటికే ఇద్దరు దర్శకులు తేజుతో సినిమా క్యాన్సిల్ చేసుకున్నారని సమాచారం. ప్రస్తుతం తేజు చేతిలో ఒక్క సినిమా మాత్రమే ఉంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘చిత్రలహరి సినిమా చేస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. మరి ఈ సినిమా అయిన తేజుకి హిట్ ఇస్తుందో లేదో చూడాలి.