వివాదాస్పద వ్యాఖ్యలతో తెలుగు చిత్రపరిశ్రమలో నెలకొన్న చీకటి వ్యవహారాలపై గొంతెత్తిన శ్రీరెడ్డిపై టాలీవుడ్ ఫిలిం ఛాంబర్ ప్రతినిధి పవన్ కల్యాణ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొంత కాలంగా శ్రీరెడ్డి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖులు, నటులను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తోందని, ఆమెపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఆయన సైబర్ క్రైమ్ పోలీసులను కోరారు.
ప్రసార మాధ్యమాల్లో ఆమె ఇష్టానుసారం మాట్లాడుతూ టాలీవుడ్ ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని ఆయన ఫిర్యాదులో ఆరోపించారు. కాగా, ఫిర్యాదును పరిశీలించిన సైబర్ క్రైమ్ పోలీసులు, దానిని న్యాయ నిపుణుల పరిశీలనకు పంపించారు. వారి సలహా మేరకు దానిపై చర్యలు తీసుకోనున్నారు.
పలు వార్తా చానళ్లు, యూట్యాబ్ చానళ్లతో మాట్లాడుతూ.. తెలుగు సినిమా ప్రముఖులపై శ్రీరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తెలుగు అమ్మాయిలను తక్కువగా చూస్తున్నారని, అవకాశాలు ఇవ్వడం లేదని వాపోయారు. పరభాషా నటీనటులను ప్రోత్సహిస్తున్నారని, తెలుగువారిని అక్కునచేర్చుకోవడం లేదని ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే.