పలాన డైరెక్టర్ కు ఓ పర్టికుల్ హీరోతో సినిమా చేయాలని ఉంటుంది. ఎట్ ది సేమ్ టైమ్ ఆ పర్టికులర్ హీరోకి…. ఇంకా ఏదో డైరెక్టర్ తో మూవీని మేనేజ్ చేయాలని ఉంటుంది. కాని అనుకున్నవన్నీ జరగవు కదా. ఎక్కడ చూసినా కాంప్రమైజ్ అయిపోతుంటారు.
అప్పట్లో చిరంజీవి,బాలకృష్ణల కోసం వారి అభిమానుల కోసం కొందరు డైరెక్టర్లు కాంప్రమైజ్ అయ్యేవారు. అలాంటి వారిలో కోదండరామిరెడ్డి, కె.రాఘవేంద్రరావులు ఉండేవారు. మరి టాలీవుడ్లో తాజాగా సెట్స్ మీదకు వెళ్లబోతోన్న చిత్రాలలో కొందరు కాంప్రమైజ్ అయ్యి ముందుకు వెళ్తున్నారు. అలా వెళ్తున్నవారిలో తారక్ – త్రివిక్రమ్, బన్నీ-బోయపాటి, చెర్రీ-శ్రీనువైట్ల, పూరి -చిరంజీవి, పూరీ-వరుణ్ తేజ్ లున్నారు.
వీరిలో ముందుగా తారక్ స్టోరీకే వద్దాం.నిజానికి తారక్ అడిగిన టైమ్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాంచి పొజిషన్లో ఉన్నాడు.తారక్ స్టేజ్ పై నుంచి మాట వరసకు అడిగితే వెటకారంగా ఆటైమ్లో ఓ నవ్వు నవ్వాడు. అలాంటి త్రివిక్రమ్ ఇవాల టైమ్ బ్యాడై…..తారక్ చెంతకు వచ్చాడు. తారక్ మాత్రం గతంలో జరిగినవి ఏవీ మనసులో పెట్టుకోకుండా…. ఎదవ మొహమాటానికి పోయి….సరే అన్నాడు
బన్నీ-బోయపాటి విషయంలో జరిగింది వేరు. బోయపాటికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు గానీ….. బోయపాటి కథను ఓకే చేయించి… కథనం విషయంలో ఓకే చెప్పడానికి అల్లు అరవింద్ కు సుతరామూ నచ్చలేదు. ఇంకా లేట్ చేస్తే బాలయ్య వందవ చిత్రం మిస్ అయిపోతుందని అల్లు అరవింద్ మోహమాటానికి బోయపాటితో సరే అనేశాడట.
ఇక చెర్రీ-శ్రీనువైట్ల చిత్రానికొస్తే… మనకు కనిపించే అంశాలు చాలానే ఉన్నాయి. నిజానికి శ్రీనుతో సినిమా చేసే ఆలోచన చెర్రీకి లేదు. కాకపోతే శ్రీనువైట్ల అతి తెలివితేటలు, కోన వెంకట్తో కలిసి పని చేసే ముచ్చటకు చెర్రీ పడిపోయాడట.
పూరి-చిరంజీవి చిత్రం విషయంలోను ఇలాంటి ఎదవ మొహమాటమే గుర్తుకు వస్తోంది. చిరును ఏదోలా మేనేజ్ చేసేసి….ఆ కబురు ఈ కబురు చెప్పి తాజాగా వచ్చిన టెంపర్ చూపించి…150వ సినిమాకు ఒప్పించేశాడట. ఇపుడు చిరు వినాయక్ కు కాకుండా ఇతనికి ఎందుకిచ్చానబ్బా అని తెగ బాధ పడిపొతున్నాడని తెలుస్తోంది.
సో…. వెధవ మోహమాటాలకు పోతే ఏమౌతుందో ఎలా బాధపడాల్సి వస్తుందో తాజాగా జరుగుతూ ఉన్న స్టోరీలను చూస్తే అర్థమవుతుంది.