- Advertisement -
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇటీవలే అరవింద సమేతతో హిట్ కొట్టాడు.ఈ సందర్భంగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతు..తనను మాటల మాంత్రికుడు అని పిలవడంపై త్రివిక్రమ్ కొత్తగా స్పందించాడు.పంచ్ కనిపెట్టినోడు,మాటల మాంత్రికుడు అని పిలిచినోళ్ళు వారిద్దరు నాకు శత్రువులే అని చెప్పుకొచ్చారు త్రివిక్రమ్… ‘నువ్వే కావాలి’ సినిమాతోనే నేను ప్రాస ఆపేశాను. చాలా మంది ప్రాసలు ప్రారంభించడంతో నేను నా ఆలోచన చెప్పడం మొదలుపెట్టాను.
ఆలోచనని ఎవరూ కాపీ కొట్టలేరు కదా.. పంచ్ కావాలని రాయను.. అది నా స్పాంటేనియస్ రియాక్షన్. రాసుకోవాల్సిన డైలాగులన్నీ మూడు, నాలుగు రోజుల్లో రాసుకుంటాను. అసలు పంచ్ అంటే ఏంటో నాకు ఇప్పటికి అర్థం కాదని తెలిపారు త్రివిక్రమ్.ఇక అరవింద తరువాత త్రివిక్రమ్ అల్లు అర్జున్తో సినిమా చేస్తాడనే వార్తలు వస్తున్నాయి.