Sunday, May 5, 2024
- Advertisement -

గురూజీ ఫోకస్ మొత్తం పవన్ సినిమా పైనే..!

- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ శ్రీనివాస్​ చేతిలో ప్రస్తుతం ఒకే ఒక్క సినిమా ఉంది. అది మహేష్ బాబు సినిమా. అయితే ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా ముగిసిన తర్వాతే త్రివిక్రమ్ సినిమా ప్రారంభమయ్యేది. అంతవరకూ త్రివిక్రమ్ ఖాళీనే. ఈ ఖాళీ సమయంలో త్రివిక్రమ్ తన దోస్త్ పవన్​ కల్యాణ్ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయ్యప్పనుమ్ కోషియమ్​ రీమేక్​ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్​ ప్లే అందిస్తున్నాడు. ఈ మూవీలో దగ్గుపాటి రానా కూడా మరో కీలక పాత్ర పోషిస్తుండగా.. సితార ఎంటర్​టైయిన్​మెంట్స్​ నిర్మిస్తున్నది. అల వైకుంఠపురములో తర్వాత త్రివిక్రమ్​ ఒక్క సినిమా కూడా ప్రారంభించలేదు. ఎన్టీఆర్​తో ఓ సినిమా అనౌన్స్​ చేశాడు కానీ ఆ మూవీ ఎందుకో పట్టాలెక్కలేదు. ఇక మహేశ్​బాబుతోనూ ఓ సినిమా ప్రకటించినా అది ప్రారంభం కావడానికి ఇంకా సమయం ఉంది. ఈ లోపు త్రివిక్రమ్ పవన్ సినిమా పూర్తి చేసే పనిలో పడ్డాడు.

ఈ సినిమా స్క్రిప్ట్​ వర్క్​, డైలాగులు రాయడంలో ఆయన బిజీగా ఉన్నాడట. ఈ నెలలోనే పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగులో జాయిన్ కానున్నాడు. ఆయన వెంట సెట్ లోకి త్రివిక్రమ్ కూడా హాజరవుతారని సమాచారం. దర్శకుడు సాగర్ కు అండగా ఉంటూ సలహాలు సూచనలు అందిస్తాడని సమాచారం. అయ్యప్పనుమ్ కోషియమ్ కు దర్శకుడు సాగర్ అయినా త్రివిక్రమ్ కూడా ఈ మూవీలో తన మార్క్ కనిపించేలా శ్రద్ధ చూపిస్తున్నాడు.

Also Read: సూపర్ స్టార్ రజిని ఫ్యాన్స్ కి షాక్.. నటనకు తలైవా గుడ్ బై..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -