Wednesday, May 1, 2024
- Advertisement -

సూపర్ స్టార్ రజిని ఫ్యాన్స్ కి షాక్.. నటనకు తలైవా గుడ్ బై..!

- Advertisement -

రజినీకాంత్ సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. రజిని త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారని ఆ వార్తల్లోని సారాంశం. రజినీకాంత్ ప్రస్తుతం సిరుత్తరై శివ దర్శకత్వంలో అన్నాత్తే అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి తన పార్ట్ ని కొన్ని నెలల కిందటే పూర్తి చేశాడు రజనీ. డబ్బింగ్ కూడా కంప్లీట్ చేశాడు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పెండింగ్ వర్క్ మిగతా నటీనటుల తో దర్శకుడు శివ రామోజీ ఫిలింసిటీలో తెరకెక్కిస్తున్నాడు. కాగా ఇటీవల రజనీకాంత్ తన భార్య కూతురు తో కలిసి అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఆయన వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. పదేళ్ళ కిందట రజినీకాంత్ కు సింగపూర్ లో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఈ చికిత్స పూర్తి చేసుకుని పదేళ్లు దాటింది. దీంతో మరోసారి వైద్య పరీక్షలు చేయించుకునేందుకు రజినీకాంత్ అమెరికా కి వెళ్ళాడు.

ప్రస్తుతం రజినీ అల్లుడు ధనుష్ ఆయన మరో కుమార్తె ఐశ్వర్య ఓ హాలీవుడ్ సినిమా షూటింగ్ సందర్భంగా అక్కడే ఉంటున్నారు. రజినీకాంత్ వారి వద్దకే వెళ్లారు. అమెరికాలో వైద్య పరీక్షలు పూర్తి చేసుకొని, ఆ తర్వాత వైద్యుల సూచన మేరకు సినిమాల్లో నటించాలా.. వద్దా..అనే విషయమై రజినీకాంత్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే అనారోగ్య కారణాలతో రజినీకాంత్ తన రాజకీయ ప్రవేశాన్ని నిలిపి వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సినిమాలకు కూడా ఆయన గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారట. ఈ న్యూస్ ఇప్పుడు రజినీకాంత్ అభిమానులకు షాక్ ఇస్తోంది.

Also Read

ఆచార్య చిత్రంలో శ్రీశ్రీ కవితలు..!

లైగర్​ మార్కెట్​ .. ఈ రేంజ్​లోనా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -