Sunday, May 19, 2024
- Advertisement -

కొత్త సినిమా కథా చర్చల్లో పవన్, త్రివిక్రమ్….. రైటర్‌గా త్రివిక్రమ్‌ని మరోసారి నమ్మిన పవన్

- Advertisement -

జల్సాలాంటి హిట్, అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ ద్వయం మూడో ప్రయత్నంలో మాత్రం విజయం సాధించడంలో ఫెయిల్ అయింది. అన్నింటికీ మించి అజ్ఙాతవాసితో త్రివిక్రమ్‌పై వచ్చిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. అయితేనేం పవన్ మాత్రం మరోసారి త్రివిక్రమ్‌లోని రైటర్‌ని నమ్ముకున్నాడు. తాజాగా నెక్ట్స్ సినిమా విషయమై చర్చలు జరుపుతున్న పవన్….. కందిరీగ, రభస సినిమాల డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్‌తో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమా నిర్మించనుంది.

ఈ సినిమా కోసం పవన్ చెప్పిన ఓ తమిళ సినిమా మాతృకను తీసుకుని పవన్ శైలికి తగ్గట్టుగా స్క్రిప్ట్ రెడీ చేశాడు సంతోష్ శ్రీనివాస్. ఇప్పుడు ఈ స్క్రిప్ట్‌ని పూర్తిగా చదివిన పవన్ ఫైనల్ కరెక్షన్స్ కోసం త్రివిక్రమ్ దగ్గరకు పంపించాడట. అజ్ఙాతవాసితో పవన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశానన్న ఫీలింగ్‌తో ఉన్న త్రివిక్రమ్ ఇప్పుడు సంతోష్ శ్రీనివాస్ స్క్రిప్ట్‌కి మెరుగులుద దిద్దుతున్నాడట. సర్దార్, కాటమారాయుడు, అజ్ఙాతవాసిలతో వరుస ఫ్లాపులతో పవన్ క్రేజ్ కాస్త మసకబారిందన్నది నిజం. అందుకే 2019 ఎన్నికల టైంకి పవన్‌కి కలిసొచ్చేలా ఈ సినిమాలో కాస్త పొలిటికల్ టచ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పుడు ఈ స్క్రిప్ట్‌ని ఇంకాస్త బెటర్ చేసే ప్రయత్నంలో ఉన్నాడట త్రివిక్రమ్. అలాగే పవన్ పొటికల్ కెరీర్‌కి ఉపయోగపడేలా కొన్ని పొలిటికల్ డైలాగ్స్ కూడా అందించనున్నాడు పవన్. వరుస హిట్స్‌తో ఊపు మీద ఉన్న మైత్రీ మూవీ మేకర్స్ బేనర్‌తో అయినా పవన్ కళ్యాణ్ హిట్ కొడతాడేమో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -