Sunday, April 28, 2024
- Advertisement -

రైటర్ ని వెతుకుతున్న త్రివిక్రమ్

- Advertisement -

అజ్ఞాత‌వాసి దెబ్బ‌తో త్రివిక్ర‌మ్ స్టామినా మీద అంద‌రికి ఓ అనుమానం ఏర్ప‌డింది.సినిమా చాలా దారుణంగా ఫ్లాప్ కావ‌డం, ప‌వ‌న్ ఫ్యాన్స్ సైతం సినిమా బాలేద‌ని, ప‌వ‌న్‌కు మంచి క‌థ ఇవ్వ‌లేద‌ని బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు చేశారు.అజ్ఞాత‌వాసి సినిమా త్రివిక్ర‌మ్ పెన్ ప‌వ‌ర్ ప‌ని చేయ‌లేద‌ని అంద‌రు విమ‌ర్శ చేశారు.ఇక సినిమా త‌రువాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో సినిమా ప్లాన్ చేశాడు త్రివిక్ర‌మ్. అస‌లు ఈ సినిమా మొద‌లు అవుతుందో లేదో డౌట్ ఏర్పడింది.త్రివిక‌మ్‌తో సినిమా వ‌ద్ద‌ని తార‌క్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో పోస్టులు కూడా చేశారు. కాని ఎన్టీఆర్ ఇవేమి పట్టించుకొకుండా త్రివిక్ర‌మ్‌తో సినిమా మొద‌లు పెట్టాడు.

త‌న మీద త‌న‌కు న‌మ్మ‌కం త‌గ్గిందో లేక కొత్త వారికి అవ‌కాశం ఇద్దాం అని అనుకుంటున్నాడో తెలియ‌దు కాని ,ఎన్టీఆర్ సినిమాకు కొత్త రైట‌ర్‌ని వెతికే ప‌నిలో ఉన్నాడు త్రివిక్ర‌మ్‌.ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లాంగ్వేజ్‌ రాయలసీమ భాషకు దగ్గరగా ఉండనుందని సమాచారం. అందుకే రాయలసీమ భాషపై పట్టున్న రచయితను వెతికే పనిలో ఉన్నాడట.ఇందుకోసం గతంలో అత్తారింటికి దారేది సినిమాలో కోట శ్రీనివాస్ కోసం మాటలు రాసిన పెంచల్‌ దాస్‌ను త్రివిక్రమ్ సంప్రదించినట్లు తెలుస్తోంది. మ‌రి ఈ సినిమా అయిన హిట్ అయ్యి త్రివిక్ర‌మ్‌కు ఊర‌ట‌నిస్తుందో లేదో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -