Friday, May 17, 2024
- Advertisement -

రాంచ‌ర‌ణ్ కోసం ఉపాస‌న కాలిన‌డ‌క‌

- Advertisement -

రాంచ‌ర‌ణ్ తాజా చిత్రం రంగ‌స్థ‌లం మంచి క‌లెక్ష‌న్స్‌తో దూసుకుపొతుంది.ఈ సినిమా చ‌ర‌ణ్ కెరీర్‌లో బిగెస్ట్ హిట్‌గా న‌లిచింది. ఈ చిత్రంతో చ‌ర‌ణ్ 100 కోట్ల మార్కెట్‌ను ఫాస్ట్ టైం ట‌చ్ చేశాడు.ఈ సినిమాలో రాంచ‌ర‌ణ్ యాక్టింగ్‌కు అంద‌రి ప్ర‌శంస‌లు అందాయి.సుకుమార్ డైరక్ష‌న‌లో వ‌చ్చిన ఈ సినిమా మార్చి 30న విడుద‌ల అయ్యింది.1980ల నాటి ప‌ల్లెటూరు వాత‌వార‌ణాన్ని సినిమాలో బాగా చూపించారు.ఈ రోజు (13 శుక్రవారం)న చిత్ర యూనిట్ స‌క్సెస్‌ను గ్రాండ్‌గా సెలబ్రెష‌న్స్ చేసుకుంటుంది.ఈ విజయాన్ని అభిమానులు, ప్రేక్షకుల సమక్షంలో ఓ పెద్ద వేడుకగా జరుపుకోవాలని చిత్ర బృందం భావిస్తోంది. ఇందులో భాగంగా నేడు (13 శుక్రవారం) సాయంత్రం హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్‌ గ్రౌండ్‌లో ‘రంగస్థలం విజయోత్సవం’ పేరుతో భారీ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు.

ఈ ఈవెంట్‌కు పవన్‌ కళ్యాణ్‌ ముఖ్య అతిథిగా విచ్చేస్తుండటం విశేషం.రాంచ‌ర‌ణ్ స‌క్సెస్‌ని ఈ విధాంగా ఎంజాయ్ చేస్తుంటే ఆయ‌న భార్య ఉపాస‌న మాత్రం త‌న భ‌ర్త సాధించిన విజ‌యన్ని దైవ స‌న్నిధిలో మొక్కులు తీర్చుకుంటు కనిపించింది.రంగస్థలం సినిమా విజయం సాధించడంతో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ్‌ భార్య ఉపాసన తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని కాలినడకన వెళ్లి దర్శించుకున్నారు. గురువారం సాయంత్రం అలిపిరి నుంచి కాలినడకను ప్రారంభిస్తున్న ఫొటోలను ఆమె ట్వీట్ట‌ర్‌లో పంచుకున్నారు.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -