ప్రస్తుత టాలీవుడ్లో కమెడియన్లలో టాప్ గేర్లో దూసుకుపోతున్నాడు వెన్నెల కిషోర్.ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు అన్నింటిలోను వెన్నెల కిషోర్ ఉంటున్నాడు.తాజాగా ఆయన నటించిన దేవ్దాస్ సినిమా విడుదలైంది.ఈ సినిమాలో వెన్నెల కిషోర్ చేసిన కామెడీ సూపర్గా ఉందని టాక్ వినిపిస్తుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడని చాలమందికి తెలిసిందే. సోషల్ మీడియాకి కూడా సమయం కేటాయిస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంటాడు వెన్నెల కిషోర్ . ఈ క్రమంలో తాజాగా ఓ పాట పాడి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు వెన్నెల కిషోర్.
తిన్నది అరక్క.. అనే కాన్స్పేట్ తో చచ్చారు పో.. అంటూ మొదలుపెట్టిన ఈ మొదటి సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ ని సింగర్ చిన్మయికి అంకితం చేశాడు. పాట పాడిన వీడియోని షేర్ చేశాడు.ఈ వీడియోపై నటుడు బ్రహ్మాజీ కామెంట్ చేస్తూ.. ”పాపం చిన్మయి ఎలా ఉందో ఒకసారి కనుక్కో” అనగా.. వెన్నెల కిషోర్.. ”అవునన్నో.. అటునుండి రెస్పాన్స్ లేదు” అనగా.. చిన్మయి స్పందిస్తూ.. ”ఇప్పుడే స్పృహ వచ్చింది” అంటూ రిప్లయ్ చేసింది. ఈ ట్వీట్టర్ సంభాషణ మొత్తం చాలా సరదాగా సాగింది.ఈ ట్వీట్టర్ సంభాషణలో నవదీప్ కూడా పాల్గొనడం విశేషం.