Monday, May 6, 2024
- Advertisement -

విజయ్ దేవరకొండ పాన్ ఇండియా ప్రేమకథ

- Advertisement -

పాన్ ఇండియా ప్రేమకథకు సిద్ధమైపోతున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం లైగర్ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న ఈ యంగ్ హీరో త్వరలో మరో భారీ ప్రాజెక్టు పట్టాలెక్కిస్తాడని ఫిల్మీ టాక్. పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 25న విడుదలకు లైగర్ సిద్ధమవుతోంది. అనన్య పాండే ఈ సినిమాతో తెలుగు తెరకి పరిచయమవుతోంది. మైక్ టైసన్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు.

ఈ సినిమా తరువాత శివ నిర్వాణ, సుకుమార్ లతో తదుపరి సినిమాలు విజయ్ దేవరకొండ చేయనున్నాడు. ముందుగా శివ నిర్వాణ ప్రాజెక్టు పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఇది ప్రేమకథా చిత్రమని అంటున్నారు.

ఈ సినిమాను కూడా పాన్ ఇండియా స్థాయిలో నిర్మించనున్నట్టుగా తెలుస్తోంది.ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కియారా అద్వానీని తీసుకున్నట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం శంకర్ – చరణ్ కాంబినేషన్లో కియారా అద్వానీ ఓ సినిమా చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -