Sunday, May 5, 2024
- Advertisement -

రాములమ్మ ని గెలికారు, గట్టిగా సమాధానం ఇచ్చింది..

- Advertisement -

సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు విజయశాంతి ఇప్పుడు తిరిగి సినీ రంగ ప్రవేశం చేయాలనే నిర్ణయం తీసుకొని ఆ విషయాన్నీ తన అభిమానుల తో పంచుకున్నారు. అయితే చాలా మంది ఆవిడ ని విమర్శిస్తూ రాజకీయాలు వదిలి వెళ్తున్నారు అని కామెంట్స్ చేయగా వారందరికీ తన ట్విట్టర్ పోస్ట్ లో విజయ శాంతి గట్టి సమాధానమే చెప్పింది.

“నేను 13 ఏళ్ల తర్వాత సినిమాల్లో నటిస్తున్నానని ప్రకటించడంపై అన్ని వర్గాల నుంచి సానుకూల ప్రతిస్పందన వస్తుంది. నేను మరలా సినీరంగ ప్రవేశం చేయడం పై కొందరు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సినిమాలలో నటిస్తే ఇక రాజకీయాలను పట్టించుకోరా అనే అనుమానం కొందరికి రావచ్చు. ఈ సందర్భంగా నేను ఒక విషయం స్పష్టం చేయదలచుకున్నాను. నాకు సినిమాల్లో నటించే అవకాశం ఆరు నెలల కిందటే వచ్చింది. కానీ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ హై కమాండ్ తరఫున నన్ను స్టార్ క్యాంపెయినర్ గాను క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గాను నాకు ప్రచార బాధ్యతలను అప్పగించారు. నాకు అప్పగించిన పని పూర్తయ్యేవరకు నేను సినిమాల్లో నటించడానికి అంగీకరించలేదు. అది రాజకీయాలపై నాకున్న కమిట్మెంట్. నా రాజకీయ ప్రస్థానానికి సంబంధించి ఇదే విధంగా కొన్ని ప్రశ్నలు లేవనెత్తె వాళ్లు కూడా ఉన్నారు.

2014-2018 వరకు కాంగ్రెస్ లో రాములమ్మ ఆక్టివ్ గా లేరని కొందరు చేసే కామెంట్స్ నా దృష్టికి వచ్చాయి. దీనికి కూడా నా సమాధానం చెప్పాలని అనుకుంటున్నాను. పార్టీ అప్పగించిన పని ఏదైనా నేను చిత్తశుద్ధితో చేశాను. ఎన్నికలకు ముందు నాలుగేళ్లపాటు నేను పార్టీ చెప్పిన పనులను తూచా తప్పకుండా చేయడం వల్లే నాకు ప్రచార కమిటీ ఛైర్మన్ బాధ్యతలను అప్పగించారు అనే విషయాన్ని గుర్తించాలి. కాంగ్రెస్ పార్టీ పరంగా చేసే పనులన్నీ ప్రజల్లోకి వచ్చి చేయకపోవచ్చు అంతమాత్రాన రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు భావించకూడదు.” అని ఆవిడ స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -