సింగర్ బేబి ఇప్పుడు ఎక్కడ చూసిన ఆమె గురించే చర్చ నడుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో బేబినే హాట్ టాపిక్గా మారింది. బేబి దెబ్బకు పల్లెటూరులో ఎంతటి టాలెంట్ ఉందో అందరికి అర్థం అయింది. బేబి సరదాగా పాడిన ఓ పాట ఇప్పుడు సంచలనంగా మారింది. మీడియాతో పాటు టాలీవుడ్ మొత్తం ఈ బేబి చూట్టునే తిరుగుతుంది. సంగీత దర్శకుడు కోటి ,మెగాస్టార్ చిరంజీవి,మురళీ మోహన్ , వంటి వారు ఈమెను ప్రత్యేకంగా కలుసుకుని ఆమె టాలెంట్ను అభినందించడంతో ఆమె ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది.
ఇప్పటికే ఏఆర్ రెహామాన్ సినిమాలో పాట పడే అవకాశం దక్కించుకున్న ఆమె,తాజాగా పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రస్తుతం ఆమె యూట్యూబ్లో ట్రెడింగ్లో ఉంది. దాదాపు ఆరు ,ఏడు ఆమె వీడియోలు యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉండటం విశేషం. రియాల్టీ షోలు,ఇంటర్య్వూస్ కాదని ఆమె వీడియోలు ట్రెండింగ్లో ఉండటం మాములు విషయం కాదు. తాజాగా ఓ సినిమాలో తన ఆమె తొలి పాటను పడటం జరిగింది. రఘు కుంచె సంగీతంలో బేబి ఓ పాట పాడారు.ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాబోవు రోజులలోబేబితో పాటు మరి కొంతమంది పల్లెటూరు వారిని మనం సింగర్స్గా చూసే అవకాశం లేకపోలేదు.