గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పేరు ..బేబి.సరదాగా ఆమె పాడిన ఓ పాట ఇప్పుడు సంచలనంగా మారింది.మీడియాతో పాటు టాలీవుడ్ మొత్తం ఈ బేబి చూట్టునే తిరుగుతుంది.సంగీత దర్శకుడు కోటి ,మెగాస్టార్ చిరంజీవి,మురళీ మోహన్ , వంటి వారు ఈమెను ప్రత్యేకంగా కలుసుకుని ఆమె టాలెంట్ను అభినందించడంతో ఆమె ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది.ఇప్పటికే ఏఆర్ రెహామాన్ సినిమాలో పాట పడే అవకాశం దక్కించుకున్న ఆమె,తాజాగా పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్గా మారింది.బేబీని ఇన్స్పిరేషన్గా తీసుకుని రైటర్ లక్ష్మి భూపాల ఈ పాటను రాశారు.
పల్లె కోయిల అంటూ సాగే ఈ పాటకు రఘు కుంచె బాణీకట్టాడు. ఈ పాటను ‘పలాస 1978’ అనే తెలుగు చిత్రం కోసం రఘు రికార్డ్ చేశాడట. ఈ పాట రికార్డింగ్ కు సంబంధించిన వీడియో రఘు కుంచె రీసెంట్ గా రిలీజ్ చేశాడు. ఈ వీడియోలో తన మొదటి రికార్డింగ్ కు ఆమె కాస్త తడబడడం.. రఘు కుంచె ఆమెను ప్రోత్సహించడం.. ఆ తర్వాత ఆమె ఆ పాటను అలవోకగా పాడడం మనం చూడొచ్చు.రాబోవు కాలంలో బేబిని పెద్ద సింగర్గా చూడటం ఖాయం అంటున్నారు నెటిజన్లు.