గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పేరు ..బేబి.సరదాగా ఆమె పాడిన ఓ పాట ఇప్పుడు సంచలనంగా మారింది.మీడియాతో పాటు టాలీవుడ్ మొత్తం ఈ బేబి చూట్టునే తిరుగుతుంది.సంగీత దర్శకుడు కోటి ,మెగాస్టార్ చిరంజీవి,మురళీ మోహన్ , వంటి వారు ఈమెను ప్రత్యేకంగా కలుసుకుని ఆమె టాలెంట్ను అభినందించడంతో ఆమె ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది.అయితే ఆమె ఇంత ఫేమస్ కావడానికి కారణం బేబి పక్క ఇంటి అమ్మాయి రాణి.బేబి రాణిలు పక్క పక్క ఇళ్లలో ఉంటారు.ఓ రోజు గంజి కోసం రాణి ఇంటికి వెళ్లిన బేబి సరదాగా పాట పాడటం విన్న రాణి ఆ పాటను తన ఫోన్లో రికార్డ్ చేసింది.
ఆ ఫోన్లో రికార్డు పాటే వాయిసే బేబిని ఇంత దూరం తీసుకువచ్చింది.బేబి ఇప్పుడు ఓ పెద్ద సెలబ్రిటీగా మారింది.ఆమె గొంతుని ప్రపంచానికి పరిచియం చేసిన రాణి మాత్రం అక్కడే ఉండిపోయింది.తాజాగా రాణిని ఓ యూట్యూబ్ ఛానెల్ వారు ఇంటర్య్వూ చూశారు. ఈ సందర్భంగా ఆమె బేబి పాడిన పాటను ,పాడి వినిపించింది. రాణిలో కూడా మంచి సింగర్ ఉన్నారని ఆ పాట విన్నావారు చెబుతున్నారు.మరి బేబిని ఇంత ఫేమస్ చేసిన మీడియా రాణి మీద కాస్తా ఫోకస్ పెడితే బాగుంటుందని కామెంట్స్వి నిపిస్తున్నాయి.