Tuesday, May 7, 2024
- Advertisement -

వీవీఆర్ ఎఫెక్ట్… అజ్ఞాతంలో బోయ‌పాటి

- Advertisement -

ఇప్పుడు టాలీవుడ్‌లో బోయ‌పాటి అంటే బాబోయ్ అంటున్నారు. టాలీవుడ్ లో పక్కా ఊర మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న బోయ‌పాటి పేరు చెబితే ఇప్పుడు స్టార్ హీరోలంతా భయంతో వణికిపోతున్నారట. మారిన తెలుగు ప్రేక్ష‌కుడి టేస్ట్‌కు త‌గ్గ‌ట్టుగా మార‌కుండా త‌న‌దైన శైలిలో సినిమాలు తీసే బోయ‌పాటి.. ప్ర‌స్తుతం అజ్ఞాతంలోకి వెళ్లాడ‌ని ఇండస్ట్రీ టాక్‌. సినిమా విడుదలకు ముందు భారీ డైలాగులు పేల్చిన‌ బోయపాటి రిలీజ్ తరువాత మాత్రం మీడియా అంటే ముఖం చాటేస్తున్నాడు.

వీవీఆర్ డిజాస్ట‌ర్‌ను జీర్ణించుకోలేక పోతున్నాడ‌ట‌. సినిమాకి రూ.11కోట్ల పారితోషికం అందుకునే బోయపాటి ఇలాంటి సినిమా తీస్తాడా? అంటూ సన్నిహిత వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. ఇప్పటికైనా మూస నుంచి బయటికి వచ్చి మితిమీరిన హింసాత్మక కథల్ని.. మాసిజాన్ని తగ్గించి కొత్తదనం నిండిన కథల్ని రాసుకుంటారా లేదా అని ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయి. ఇక‌నైనా మారిన ట్రెండ్ కి తగ్గట్టు మారతారా.. లేదా తాను తీసిందే కరెక్ట్ అంటూ మళ్లీ ఊరమాస్ సినిమాలకే ఫిక్స్ అవుతారా! అంటూ కాస్త ఘాటుగానే సోష‌ల్ మీడియాలో చర్చ సాగుతోంది. అంచనాను అందుకుంటే ఓకే .. లేదంటే విమర్శకుల దాడికి బలి కావాల్సిందే. ఇప్పుడు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు బోయపాటి శ్రీను. అక్కినేని కాంపౌండ్‌కు క‌థ వినిపించి రిజెక్ట్ అవ్వ‌డం కూడా బోయ‌పాటి బాధ‌ను మ‌రింత పెంచిన‌ట్టు స‌మాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -