- Advertisement -
తమిళ హీరో విశాల్ మంచి జోష్లో ఉన్నాడు. ఇటీవలే ఆయన నటించిన అభిమన్యుడు సినిమా అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోను మంచి విజయం సాధించింది. విశాల్కు తెలుగులో మంచి మార్కెట్ ఉంది.దీంతో ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులోను విడుదల అవుతుంది. తనకు హీరోగా మొదటి హిట్ ఇచ్చిన పందెం కోడి సినిమాకు సీక్వెల్తో ప్రేక్షకుల ముందుకు రాబోతుఉన్నాడు.
పందెం కోడి సినిమాకు దర్శకత్వం వహించిన లింగుస్వామియే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాను దీపావళికి విడుదల చేయాలనే ఆలోచనలో విశాల్ వున్నాడు. అక్టోబర్ 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను విశాల్ తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మిస్తున్నాడు.