మీడియాతో దర్శకుడు వీవీ వినాయక్
ఫ్యాక్షనిజం, రాజకీయ, ముఠా కక్షలు తదితర అంశాలతో సినిమాలు తీసిన దర్శకుడు వీవీ వినాయక్. వినాయక్ సినిమాలు అంటే యాక్షన్కు పెద్ద పీట వేస్తూనే కామెడీని కూడా మేళవించి సందేశాత్మకంగా సినిమాలు తీశాడు. ఆయన ఇటీవల ఓ పర్యటనలో ఉన్నప్పుడు మీడియాతో మాట్లాడారు. తాను ఎప్పుడూ ఒక సందేశం ఇవ్వడానికి సినిమాలు తీసేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పుకొచ్చారు. ఇంకా మరికొన్ని విషయాలు పంచుకున్నారు. చదవండి.. మీరే.
పెడదారి పట్టిన సమాజాన్ని ప్రభావితం చేసే… సన్మార్గంలో నడిపించే ఇతివృత్తంతో సినిమాలు చేస్తూ వచ్చానని గుర్తుచేశారు. అదే ఒరవడి కొనసాగిస్తూ ప్రస్తుతం సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తానన్నారు. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ స్ఫూర్తితో దర్శకుడిని కావాలనే లక్ష్యంతో సినీ పరిశ్రమకు వచ్చానని గుర్తుచేసుకున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీర్ ప్రారంభించానని చెప్పారు.
ఈవీవీ సత్యనారాయణ వద్ద, దర్శకుడు సాగర్ వద్ద కృష్ణ హీరోగా ‘అమ్మదొంగా’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశానని తెలిపారు. తొలుత జూనియర్ ఎన్టీఆర్ను దృష్టిలో పెట్టుకుని ‘ఆది’ సినిమా తీయగా సూపర్హిట్గా నిలిచిందన్నారు. ఇప్పటివరకు 16 సినిమాలు తీయగా అందులో 13 సూపర్హిట్గా నిలవడం అంతకుమించి ఏమి ఉంటదని చెబుతున్నారు. ప్రస్తుతం సినిమాలేవీ చేతిలో వేని త్వరలో కథ ప్రారంభిస్తున్నటు్ల తెలిపారు. ఆ కథకు హీరో ఎవరన్నది ఇంకా అనుకోలేదన్నారు. ‘‘నాకు లక్ష్యం అంటూ ఏమీ లేదని, డైరెక్టర్ కావాలని ఆశించాను. అయ్యాను. ఆశించిన దానికన్నా వెయ్యిరెట్లు సంతృప్తి చెందాను’’ అని వినాయక్ చెప్పుకొచ్చారు.