Monday, April 29, 2024
- Advertisement -

ఆర్జీవీ మార్క్..రెండు సినిమాలకు ఒకే ట్రైలర్!

- Advertisement -

ఆర్జీవీ అంటేనే వివాదాలకు, సెన్సేషన్‌కు కేరాఫ్. ప్రస్తుతం రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వ్యూహం, శపథం సినిమాలు తెరకెక్కుతున్నాయి. అనేక వాయిదాల అనంతరం ఫిబ్రవరి 23న వ్యూహం, మార్చి 1న శపథం రిలీజ్ కానున్నాయి.

ఈ నేపథ్యంలో రెండు సినిమాల ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. రెండు సినిమాల స్టోరీ ఒకటే కావడంతో ఈ రెండు సినిమాలకు ఒకే ట్రైలర్‌ని కట్ చేశారు. వైఎస్ జగన్ పాత్రను అజ్మల్ పోషించగా జగన్‍ సీఎం కాక ముందు ఘటనలను వ్యూహం చిత్రంలో, సీఎం అయ్యాక పరిస్థితులను శపథంలో చూపించనున్నారు.

ఇక ట్రైలర్‌లో జగన్‍కు వ్యతిరేకంగా ఇతర ప్రధాన రాజకీయ పార్టీలు కుట్రలు చేశాయి అన్నది చూపించారు. వ్యూహం, శపథం చిత్రాల్లో వైఎస్ భారతి పాత్రలో మానసా రాధాకృష్ణ నటించారు.వ్యూహం సినిమాకు అనేక అవాంతరాలు ఎదురుకాగా చివరకు కోర్టు అనుమతితో సెన్సార్ కాగా శపథం చిత్రం సెన్సార్ విషయంలో క్లారిటీ రాలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -